మోస్రా (చందూర్), ఫిబ్రవరి 7: నిజామాబాద్ జిల్లాలో వరుస కిడ్నాప్ల నేపథ్యంలో గ్రామాల్లో ప్రజలు అప్రమత్తమయ్యారు. చిన్న పిల్లలను ఎత్తుకెళ్లే ముఠా జిల్లాలో సంచరిస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. ఎవరైనా అపరిచితులు కనిపిస్తే చాలు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు అడిగి తెలుసుకొంటున్నారు.
ఈ క్రమంలో మోస్రా మండలంలోని తిమ్మాపూర్లో బుధవారం చాక్లెట్లు పట్టుకొని తిరుగుతున్న ఓ గుర్తు తెలియని వ్యక్తికి గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పజెప్పారు. పిల్లల పట్ల వారి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని గ్రామస్తులకు పోలీసులు ఈ సందర్భంగా సూచించారు.