రైతుల శ్రేయస్సు కోసం పరితపిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం తాజాగా అన్నదాతలకు మరో శుభవార్త చెప్పింది. అప్పుల ఊబిలో చిక్కుకున్న అన్నదాతలకు ఇప్పటికే రైతుబంధు వంటి పథకాల ద్వారా అండగా ఉంటున్న ప్రభుత్వం.. రైతులకు రుణ సంకెళ్ల నుంచి విముక్తి కల్పించాలని కీలక నిర్ణయం తీసుకున్నది. గతంలో ఇచ్చిన మాట ప్రకారం రూ.లక్ష లోపు పంట రుణాలను మాఫీ చేయనున్నది. నేటి నుంచే ఈ ప్రక్రియను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. రుణమాఫీ చేయాలని గతంలోనే యత్నించినప్పటికీ కరోనా విపత్తుతో పాటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహకరించక పోవడం వల్ల ఆలస్యమైంది. అయితే, ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే విడుతల వారీగా రూ.50 వేల లోపు పంటరుణాలను మాఫీ చేసింది. ఇప్పుడు రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేయనున్నది. అది కూడా ఈ నెలన్నరలోపే పూర్తి చేయనుండడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. సీఎం ప్రకటనతో బాన్సువాడ, బోధన్, ఆర్మూర్లో కర్షకులు బుధవారం సంబురాలు జరుపుకొన్నారు. కేసీఆర్కు ధన్యవాదాలు తెలుపుతూ ఆయన చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
– నిజామాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నిజామాబాద్, ఆగస్టు 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి) ; రైతుల మేలు కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇచ్చిన మాటను నెరవేర్చేందుకు రుణమాఫీ ప్రక్రియను సంపూర్ణంగా అమలు చేయాలని యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. కేవలం నెలన్నర రోజుల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సిందిగా చెప్పడంతో అర్హులైన రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటూ దేశంలోనే రాష్ట్ర సర్కారు ప్రత్యేకతను చాటుకుంటున్నది. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, సకాలంలో ఎరువులు, విత్తనాలు, ధాన్యం కొనుగోళ్లు, సాగుకు నీటి సౌకర్యం ఒక్కటేమిటి అనేక రకాలుగా చేదోడు వాదోడుగా నిలుస్తూ రైతులను అక్కున చేర్చుకుంటున్నది. అప్పుల ఊబీ నుంచి బయటికి తీసుకువచ్చేందుకు కేసీఆర్ చేస్తున్న కృషికి సత్ఫలితాలు దక్కుతున్నాయి. ఇందులో భాగంగానే రైతుల రుణమాఫీ హామీని నిలబెట్టుకొని మరోసారి ప్రత్యేకతను చాటుకునేలా కేసీఆర్ పాటుపడుతున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో మొదటి, రెండో విడుదల్లో దాదాపుగా 96వేల మందికి రుణమాఫీ వర్తించింది. ఈ మొత్తం విలువ దాదాపుగా రూ.219 కోట్లు ఉంటుందని వ్యవసాయ శాఖ చెబుతున్నది. ఆగస్టు 3నుంచి మొదలు పెట్టబోయే రూ.లక్షలోపు రుణాల రద్దుతో మిగిలిన వారందరికీ మేలు జరుగనున్నది. డిసెంబర్ 11, 2018 నాటికి రూ.లక్ష అప్పు ఉంటే మాఫీ చేసేలా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
రైతులకు పంట రుణం మాఫీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. ఈ ప్రక్రియను వెంటనే అమలు చేసి సెప్టెంబర్ రెండో వారంలోపు సంపూర్ణంగా పూర్తి చేయాలని నిర్ణయించారు. మొదట రూ.25వేలు లోపు రుణం తీసుకున్న రైతులకు మాఫీ కాగా రెండోవిడుతలో భాగంగా రూ.50వేలలోపు వారికి రుణమాఫీ వర్తించింది. సీఎం ఆదేశాలతో సంపూర్ణంగా రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రూ.50వేలలోపు దాదాపుగా 57,908 మంది రైతులున్నారు. వారికి రూ.175 కోట్లు వరకు ఇప్పటికే మాఫీ అయ్యింది. రుణమాఫీ అమలుకు సీఎం ఆదేశించడంతో వ్యవసాయ శాఖ అధికారులు అర్హులైన రైతుల జాబితాను రూపొందించే పనిలో నిమగ్నం కానున్నారు. నిజామాబాద్ జిల్లాలో పంట రుణ మాఫీ పథకం కింద మొదటి విడుతలో రూ.25వేలలోపు రుణాలు ఉన్న 38,695 మంది రైతులకు రూ.44.74కోట్లు మాఫీ జరిగింది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు 96,603మందికి రుణమాఫీ లబ్ధిచేకూరింది. వీరికి వర్తించిన రుణమాఫీ మొత్తం రూ.219 కోట్లుగా వ్యవసాయ శాఖ పేర్కొన్నది. మొదటి, రెండో విడుతల్లో రుణమాఫీ దక్కించుకున్న వారంతా చిన్న, సన్నకారు రైతులే కావడం విశేషం.
రైతు రుణ మాఫీ ప్రక్రియ ఈ-కుబేర్ ద్వారా జమ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో రూ.లక్షలోపు బ్యాంకుల్లో రుణాలున్న రైతులందరి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమవుతాయి. రైతుబంధు తరహాలోనే ఈ-కుబేర్ ద్వారా నగదు బదిలీ అవుతున్నది. ఎన్నికల హామీలో భాగంగా రూ.లక్షలోపు రుణమాఫీపై సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు. గతంలో రూ.25వేలు, రూ.50వేలలోపు రుణాలను రద్దు చేశారు. రెండో విడుతలో రూ.50వేలలోపు రుణాలు కలిగిన వారిలో కొంత మందికి రుణమాఫీ వర్తించలేదు. వారికి ఈ దఫాలో రుణం రద్దు కానున్నది. మొదట రుణమాఫీని ప్రభుత్వం మొత్తం నాలుగు విడుతలుగా బ్యాంకులకు చెల్లించనున్నట్లుగా పేర్కొన్నప్పటికీ ఇప్పుడు ఒకేసారి అందరికీ రుణమాఫీ జరుగనున్నది. అన్నదాతలను అప్పుల ఊబి నుంచి తప్పించేలా రాష్ట్ర ప్రభుత్వం పంట రుణ మాఫీ ప్రక్రియను తలపెట్టింది. ప్రతి రైతుకూ రూ.లక్ష వరకు రుణాన్ని మాఫీ చేస్తామని 2018 శాసనసభ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ మేనిఫెస్టో అంశాన్ని అమలు చేసేలా సీఎం కేసీఆర్ నడుం కట్టారు. 2014లోనూ రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష వరకు పంట రుణాలను మాఫీ చేసింది. పంట రుణం, బంగారం రుణమున్నా, ఎన్ని బ్యాంకుల్లో రుణమున్నా గరిష్ఠంగా ఒక్కో రైతుకు రూ.లక్ష వరకు మాఫీ చేశారు. ఈ క్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో లక్ష మంది రైతులకు ప్రయోజనం చేకూరింది.
సీఎం కేసీఆర్ సార్ తీసుకున్న రుణమాఫీ నిర్ణ యం హర్షణీయం. సీఎం కేసీఆర్ ప్రకటనతో చాలా సంతోషంగా ఉన్నది. ఇలాంటి సీఎం దొరకడం మా రైతుల అదృష్టం.
– హైమద్ఖాన్, సాటాపూర్, రెంజల్
రైతుల కష్టాలను కండ్లారా చూసిన సీఎం కేసీఆర్.. అడగకుండానే రుణమాఫీ చేసి మా మనస్సులో నిలిచారు. కేసీఆర్ను గుండెల్లో పెట్టుకుంటాం. రుణమాఫీ చేయడం చారిత్రాత్మక నిర్ణయం. ప్రభుత్వానికి అండగా ఉంటాం.
– సికందరుద్దీన్, బోర్గాం, రెంజల్
నిజాంసాగర్ : రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం కేసీఆర్ రుణమాఫీ ప్రకటించడం హర్షించదగ్గ విషయం. ఆర్థిక మాంద్యం, కరోనాతో రుణమాఫీ పూర్తిగా కాలేదు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో ఇప్పుడు రుణమాఫీ ప్రక్రియ సవ్యంగా సాగుతున్నది. రుణమాఫీ ప్రకటించి సీఎం కేసీఆర్ రైతుల పాలిట దేవుడిగా మారాడు.
– అంజయ్య, మాగి, నిజాంసాగర్ మండలం
వ్యవసాయాన్ని పండుగలా చేసేందుకు రైతుల పంట రుణాలు మాఫీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ నిర్ణయించడం ప్రతిపక్షాలకు చెంపపెట్టు లాంటింది. రైతుల ముఖాల్లో సంతోషాన్ని చూసేందుకు సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారు. ఆయనకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం.
– గొల్ల రాజన్న, బోర్గాం, రెంజల్
స్వయాన రైతు అయిన సీఎం కేసీఆర్కు మా కష్టాలు తెలుసు. అందుకే రైతు రుణమాఫీపై మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు రైతు మేలు కోరే నాయకుడిని చూడలేదు. రైతును బాగు చేసేందుకు వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తూ రైతులను ఆదుకుంటున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
-ల్యాగల మహిపాల్, యువరైతు, రామారెడ్డి
నేను హైదరాబాద్లో ఉద్యోగం మానేసి సొంతూర్లో వ్యవసాయం చేస్తున్న. సీఎం కేసీఆర్ రైతులకు ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతు బీమా, సబ్సిడీ విత్తనాలు, ఉచిత విద్యుత్, ఎరువుల కొరత లేకుండా చూడడం, రుణమాఫీ వంటి సంక్షేమ పథకాలు చూసి సంబురమేసింది. మాలాంటి యువకులు వ్యవసాయం చేసేందుకు సీఎం కేసీఆర్ స్ఫూర్తి ప్రదాత.
– అరిగె ధర్మతేజ, యువరైతు, బీర్కూర్
ఊర్లలో ఈ మధ్యన రుణమాఫీ కాదని, ఎవరెవరో ఏదేదో మాట్లాడుతుంటే భయం వేసింది. సీఎం కేసీఆర్ సారు మీద నమ్మకం మాత్రం సడలిపోలేదు. కేసీఆర్ సార్ రుణమాఫీ ప్రకటనతో మా ఇంట్లో పండుగ వాతావరణం ఏర్పడింది. రైతు కష్టం తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్. అందుకే ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా మాకు రుణమాఫీ ప్రకటించారు. సీఎం సారుకు సదా రుణపడి ఉంటాం.
– అబ్దుల్ గఫార్, బీర్కూర్
రుణమాఫీ ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతున్నది. గతంలోని ప్రభుత్వాలూ రైతు రుణమాఫీపై స్పందించలేదు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల పక్షాన నిలుస్తున్నారు. సీఎం కేసీఆర్కు రైతులందరం రుణపడి ఉంటాం.
– రమేశ్గౌడ్, భవానీపేట, పాల్వంచ మండలం.
దేశంలో రైతుల మేలు కోరే ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. రైతుల రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్కు రైతులందరం రుణపడి ఉంటాం. గతంలో రైతులను పట్టించుకున్న దాఖలాలు లేవు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతుల మేలు కోరి పని చేస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వానికి రైతుల పక్షాన ధన్యవాదాలు.
సదాశివనగర్: రైతుల పక్షపతిగా ఉంటూ రైతుల సంక్షేమాన్ని కోరే ఏకైక సీఎం కేసీఆర్. రైతులకు ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నానంటూ భరోసా ఇస్తారు. రైతు రుణమాఫీ చేసిన రైతునేస్తం సీఎం కేసీఆర్. ఆయనను ఎన్నటికీ రైతులు
మరువరు.
– పైడి జనార్దన్ యాదవ్, అడ్లూర్ ఎల్లారెడ్డి.
సదాశివనగర్: రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకే సీఎం కేసీఆర్ రుణమాఫీ చేస్తున్నారు. ఇది రైతుల అదృష్టం. రైతులు బ్యాంక్ ద్వారా తీసుకున్న వ్యవసాయ రుణాలను పెద్ద మనుసుతో మాఫీ చేయడం మంచి పరణామం. రైతులు ఎల్లప్పుడూ కేసీఆర్ వెంటే ఉంటారు.
– ఎండ్రియాల సాయాగౌడ్, అడ్లూర్ ఎల్లారెడ్డి
రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ రాజీపడడం లేదు. రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన కేసీఆర్.. రుణమాఫీ చేయడం అభినందనీయం. ఎంతో మంది రైతులు ఈ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. రైతులకు సంతోషకరమైన వార్త.
– పర్వతిని అన్నారం, సత్యనారాయణపురం, వర్ని
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక సీఎం కేసీఆర్. రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలతోపాటు ఎన్నో కొత్త పథకాలు ప్రవేశపెట్టి రైతులు అప్పులపాలు కాకుండా ఆదుకుంటున్నారు. రైతుబంధు ద్వారా పంట పెట్టుబడులు అందించి, రైతులకు మద్దతు ధర ఇస్తున్నారు. రైతు బీమా ద్వారా కుటుంబానికి ధీమా కల్పిస్తున్నారు.
– సాతుల్యా, సిద్ధాపూర్, వర్ని
ప్రజల సంక్షేమం కోసం సంచలన నిర్ణయాలు తీసుకోవడం సీఎం కేసీఆర్కే సాధ్యమవుతుంది. ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీ చేయడం అభినందనీయం. గతంలో రూ.25వేల వరకు రుణమాఫీ చేశారు. మిగితా రైతులకు రుణమాఫీ చేయడంఎంతో లాభదాయకం. పంట నష్టపోయిన రైతులకు రుణమాఫీ ఊరటనిస్తుంది.
– కన్నా దేవేందర్, పైడిమల్, వర్ని
నిజాంసాగర్: తెలంగాణ ప్రభుత్వం మరోసారి కిసాన్ సర్కారు అని నిరూపించారు. రైతుల పాలిట దేవుడిగా మారిన కేసీఆర్ సల్లంగ ఉండాలి. రుణమాఫీ చేస్తుండడం సంతోషంగా ఉంది. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటూ రైతుల అభివృద్ధే ధ్యేయంగా కేసీఆర్ కృషి చేస్తున్నారు.
-సత్యాగౌడ్, నిజాంసాగర్
నిజాంసాగర్ : రాష్ట్ర ప్రభుత్వం చేసిన రైతు రుణమాఫీ ప్రకటన చాలా సంతోషకరం. ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ ప్రకటించడం అభినందనీయం. మరోమారు ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు ప్రభుత్వంగా నిరూపించారు.
– బాబియా నాయక్, వొడ్డెపల్లి తండా, నిజాంసాగర్
నిజాంసాగర్: సీఎం కేసీఆర్ రైతుల పాలిట దేవుడు. నిత్యం రైతుల బాగు కోసమే ఆలోచిస్తారు. రుణ మాఫీ ప్రకటన చేయడం చాలా సంతోషంగా ఉన్నది. ఇప్పటికే ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టి తాజాగా రుణమాఫీ ప్రకటించడంతో ఆయనకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం.
– పెద్దోళ్ల సాయిలు, మాగి, నిజాంసాగర్
బ్యాంకుల్లో రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ తీపి కబురును అందించారు. దీంతో మరోసారి రైతు బాంధవుడు అనిపించుకున్నారు. ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న రుణమాఫీని చేయనున్నట్లు ప్రకటించడం సంతోషకరమైన విషయం. రైతులు సీఎం కేసీఆర్ను జీవితాంతం గుర్తుంచుకుంటారు.
– ఉప్పు సాయిలు, గండివేట్, గాంధారి
రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తానని మాట ఇచ్చిన సీఎం కేసీఆర్, రేపటి నుంచి మాఫీ చేయనున్నట్లు ప్రకటించి ఆ మాట నిలబెట్టుకున్నారు. రైతుల మేలు కోరి రైతుబంధు, రైతు బీమా, పంటల కొనుగోలు లాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. సీఎం కేసీఆర్ను జీవితాంతం గుండెల్లో పెట్టుకుంటాం.
– బొల్లారం రమేశ్, రైతు, గౌరారం, గాంధారి
రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నడు. పంట రుణమాఫీ చేస్తామని సీఎం సారు ప్రకటించడం సంతోషంగా ఉన్నది. ఇలాంటి మంచి మనసున్న సీఎం సార్ను ఎప్పుడూ చూడలేదు. రుణమాఫీతో మా కష్టాలు తీరుతాయి.
– బస్వయ్య, బోర్లం క్యాంపు
రైతు సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ చేస్తామని సీఎం సార్ ప్రకటించడంపై ఆయనకు కృతజ్ఞతలు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు మేలు చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్. ఆయన తీసుకున్న నిర్ణయంతో లక్షలాది కుటుంబాలకు మేలు జరుగనున్నది.
– హర్జ్యానాయక్, పోచారం తండా.
రైతులకు వ్యవసాయ పంట రుణాలను మాఫీ చేయాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం రైతు కుటుంబాల్లో వెలుగులు నింపింది. ఇచ్చిన మాటకు కట్టుబడే ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్. ఆయన పాలనలో రైతులు సుభిక్షంగా ఉన్నారు. ఆయనకు రైతులు జీవితాంతం రుణపడి ఉంటారు.
– ధరావత్ లక్ష్మణ్, జక్కల్దాని తండా