వేల్పూర్/డిచ్పల్లి/జక్రాన్పల్లి/నిజామాబాద్ రూరల్/ఆర్మూర్/సదాశివనగర్/భిక్కనూరు/కామారెడ్డి/నిజాంసాగర్, నవంబర్ 7: బీఆర్ఎస్లోకి చేరికల పర్వం కొనసాగుతున్నది. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గులాబీ గూటికి వస్తున్నారు. దీంతో ప్రతిపక్షాలు ఆగమాగం అవుతున్నాయి. బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ, మోర్తాడ్, భీమ్గల్, ఏర్గట్ల మండలాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సుమారు వంద మంది మంగళవారం బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి వేముల గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్ నాయకులు జక్కుల నవీన్, సొసైటీ డైరెక్టర్ అబ్బన్న, లక్ష్మణ్, మోహన్, సాయిలు, మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన బీజేపీ నాయకులు సాత్పుతే మనోజ్, అంజు, ఏర్గట్ల మండలం తొర్తి గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు ఎం.నవీన్ భూమేశ్, సురేశ్, బాల్కొండ మండలం బోదేపల్లి కాంగ్రెస్ ప్రెసిడెంట్ నోముల శ్రీనివాస్, కార్యకర్తలు, భీమ్గల్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు లింబాద్రి, సురేశ్, గంగాధర్, కార్యకర్తలు ఉన్నారు.
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో వందల మంది బీఆర్ఎస్లో చేరగా రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. డిచ్పల్లి మండలం ఖిల్లా డిచ్పల్లికి చెందిన వివిధ సంఘాల సభ్యులు 270 మంది బీఆర్ఎస్లో చేరారు. జక్రాన్పల్లి మండలం తొర్లికొండ, మునిపల్లి గ్రామాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు 400 మంది సర్పంచ్ సురేశ్, ఎంపీటీసీ పద్మా రాజమల్లు, ఎంపీపీ విమలారాజు, వైస్ ఎంపీపీ తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. పాల్దా సొసైటీ మాజీ వైస్చైర్మన్ ప్రతాప్రెడ్డితోపాటు గూపన్పల్లి మాజీ ఎంపీటీసీ మహంతం లక్ష్మణ్ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరగా, వారిని పార్టీలోకి బాజిరెడ్డి, వీజీగౌడ్ సాదరంగా ఆహ్వానించారు. మోపాల్ మండలం కంజర గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు మధుసూదన్ ఆధ్వర్యంలో వంద మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు.
ఆర్మూర్ పట్టణంలోని వెంకటేశ్వర కాలనీకి చెందిన సెటిలర్స్ అసోసియేషన్ సభ్యురాళ్లతోపాటు ఆర్మూర్ మండలం మచ్చర్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే జీవన్రెడ్డి అంకాపూర్లోని తన నివాసం వద్ద గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
సదాశివనగర్ మండలం లక్ష్మీనాయక్ తండాకు చెందిన 60 మంది గిరిజన యువకులు బీఆర్ఎస్ నాయకులు శంకర్ నాయక్, మోహన్ సింగ్నాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. నాగిరెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ తన క్యాంప్ కార్యాలయంలో గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని రామేశ్వరపల్లి గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు బాల్కిషన్ గౌడ్, అడ్లూర్ గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు అఫీజ్, సోషల్ మీడియా కన్వీనర్ మనోజ్ యాదవ్ బీఆర్ఎస్లో చేరారు. వారికి ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్, బీఆర్ఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 24, 25వ వార్డుల్లోని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, కార్యర్తలు 150 మంది బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, రాష్ట్ర నాయకుడు నిట్టు వేణుగోపాల్ రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
బీజేపీ భిక్కనూరు మండల మాజీ అధ్యక్షుడు సురేశ్గుప్తా అంతంపల్లి గ్రామంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ మాజీ చైర్మన్ కొమ్ముల తిర్మల్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. నిజాంసాగర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే హన్మంత్షిండే, జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.