ఎల్లారెడ్డి/ ఎల్లారెడ్డి రూరల్/ గాంధారి, నవంబర్ 13 : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారు. ఆయా పార్టీలకు చెందిన పలువురు నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే జాజాల సురేందర్ సమక్షంలో ఆది, సోమవారాల్లో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే జాజాల గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
బీజేపీ కీలక నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి అనుచరుడు, ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మత్తమాల ప్రశాంత్గౌడ్ ఎమ్మెల్యే సురేందర్ ఆధ్వర్యంలో సోమవారం బీఆర్ఎస్లో చేరారు. ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా ఉండాలని బీఆర్ఎస్లో చేరినట్లు ఆయన తెలిపారు. ఎల్లారెడ్డి పట్టణంలోని 10, 12వ వార్డులకు చెందిన మైనారిటీ యువకులు, మండలంలోని మీసానిపల్లి గ్రామస్తులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. లింగంపేట మండలం మెంగారం గ్రామానికి చెందిన పలువురు యువకులు బీఆర్ఎస్లో చేరగా.. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జనార్దన్గౌడ్, ఎల్లారెడ్డి బల్దియా చైర్మన్ కుడుముల సత్యనారాయణ, సొసైటీ చైర్మన్ ఏగుల నర్సింహులు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జలంధర్రెడ్డి, నాయకులు పృథ్వీ, సాయిరాం గౌడ్, ప్యాలాల రాములు, నీలకంఠం, ఇమ్రాన్, ముజ్జూ, శ్రావణ్కుమార్, అరవింద్గౌడ్, అనిల్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
గాంధారి మండలంలోని గుజ్జుల్ తండా ఉప సర్పంచ్ దీప్చంద్తోపాటు పలువురు తండావాసులు ఎమ్మెల్యే జాజాల సురేందర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే జాజాల సురేందర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. సురేందర్ను మరోసారి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రాధాబలరాం, ఎంపీటీసీ పీర్యానాయక్, దుర్గం శివాజీ, ప్రేమ్దాస్ రవి, హేమ్సింగ్, రమేశ్, సూర్యప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.