వర్ని, మార్చి 14: ఆరోగ్య తెలంగాణే సీఎం కేసీఆర్ లక్ష్యమని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని శంకోర గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆరోగ్య ఉప కేంద్రం భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని నిరుపేదలందరికీ కార్పొరేట్ వైద్యసేవలు అందించేందుకు సీఎం కేసీఆర్ చర్యలు చేపడుతున్నారని తెలిపారు. ఇందులో భాగంగా కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారని చెప్పారు.
గ్రామాల్లో ప్రతి పేదకు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలను అందిస్తున్నట్లు తెలిపారు.గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు న్యూట్రిషన్ కిట్, కేసీఆర్ కిట్తోపాటు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నట్లు వివరించారు. ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బర్దావల్ హరిదాస్, ఏఎంసీ వైస్ చైర్మన్ వెలగపూడి గోపాల్, సర్పంచ్ లక్ష్మి, విండో చైర్మన్ కృష్ణారెడ్డి, నామాల సాయిబాబా, బీఆర్ఎస్ నాయకుడు కల్లాలి గిరి తదితరులు పాల్గొన్నారు.
జాకోర ఎత్తిపోతల పనులను పరిశీలించిన స్పీకర్
మండలంలోని జాకోర గ్రామం వద్ద నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం పనులను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మంగళవారం పరిశీలించారు. నిజాంసాగర్ కాలువ వద్ద నిర్మిస్తున్న సంప్ పనులను పరిశీలించిన ఆయన.. అధికారుల నుంచి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాలువల నిర్మాణంతోపాటు ఇతర పనులను వేగవంతం చేయాలని సూచించారు.
లక్ష్మాపూర్, మేడ్పల్లి గ్రామాల్లో అభివృద్ధి పనులను ప్రారంభించిన పోచారం
చందూర్, మార్చి 14: మండలంలోని లక్ష్మాపూర్, మేడ్పల్లి గ్రామాల్లో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. గ్రామంలో ఎస్డీఎఫ్, ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.20 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు స్పీకర్ స్థానిక నాయకులతో కలిసి భూమిపూజ చేశారు. మేడ్పల్లి ప్రాథమిక పాఠశాలలో ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమంలో భాగంగా రూ.22 లక్షలతో మౌలిక సదుపాయాలైన వంటశాల, ప్రహరీ నిర్మాణం తదితర పనులు పూర్తికాగా.. సభాపతి పోచారం ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచులు బోడ్డోల్ల సత్యనారాయణ, లకావత్ రవి, ఏఎంసీ చైర్పర్సన్ కవితా అంబర్ సింగ్, ఎంపీటీసీ శ్యామ్రావ్, ఎం పీడీవో నీలావతి, ఎంపీవో తారాచంద్, పలు గ్రా మాల సర్పంచులు సాయరెడ్డి, దేవీసింగ్, తహసీల్దార్ వసంత, సొసైటీ చైర్మన్ అశోక్, సొసైటీ మాజీ చైర్మన్ మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.