మోర్తాడ్/ఏర్గట్ల, అక్టోబర్ 17 : రానున్న శాసనసభ ఎన్నికల్లో మం త్రి వేముల ప్రశాంత్రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని మండలంలోని వడ్యాట్ గ్రామంలోని గంగపుత్ర సంఘానికి చెందిన 24 కుటుంబాలు మంగళవారం ఏకగ్రీవ తీర్మానం చేశాయి. ఈ సందర్భంగా కుల సంఘాల సభ్యులు మాట్లాడుతూ…గతంలో తమ గ్రామం గురించి ఎవరూ పట్టించుకోలేదని.. కానీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఎన్నో అభివృద్ధి పనులు మం జూరు చేయించారని, సబ్స్టేషన్ ఏర్పాటు చేయిం చి విద్యుత్ ఇబ్బందులు దూరం చేశారన్నారు. అభివృద్ధి చేస్తున్న వేముల వెంటే నడుస్తామని స్పష్టం చేశారు. అనంతరం తీర్మాన పత్రాన్ని బీఆర్ఎస్ నాయకులు గంధం మహిపాల్, బాలమల్లేశ్, ఉపసర్పంచ్ మహేశ్కు అందజేశారు.
ఏర్గట్ల మండలంలోని గుమ్మిర్యాల్ గ్రామానికి చెందిన కృష్ణ యాదవ, రజక, మున్నూరు కాపు సంఘ సభ్యులు మంగళవారం సమావేశం నిర్వహించి మంత్రి వేములకు మద్దతు పలికారు. కార్యక్రమంలో ఎంపీపీ కొలిప్యాక ఉపేందర్ రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు గుల్లే రాజేశ్వర్, పార్టీ మండల అధ్యక్షుడు ఎనుగందుల రాజపూర్ణానందం, బాల్కొండ నియోజకవర్గ సమన్వయ సభ్యులు గడ్డం లింగారెడ్డి, రైతు బంధు సమితి జిల్లా సభ్యుడు నేరెళ్ళ లింగారెడ్డి, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు క్యాతం సుభాష్ రెడ్డి, పార్టీ నాయకులు ముక్కెర దేవన్న, రాజేశ్వర్ పాల్గొన్నారు.