Harsha Toyota | నమస్తే తెలంగాణ నిజామాబాద్ : హర్ష టయోటా గ్రామీణ మహోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీనగర్ కాలనీ బసవ గార్డెన్ రోడ్ లో గ్రామీణ మహోత్సవం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 45వ డివిజన్ మాజీ కార్పొరేటర్ హేమలతశ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ మహోత్సవం 22, 23, 24 తేదీల్లో మాత్రమే నిర్వహిస్తున్నారని తెలిపారు.
హర్ష టయోటా వారు సరసమైన ధరలకు అందిస్తున్నారని పేర్కొన్నారు. భారీ డిస్కౌంట్లతో కార్లన్నీ అమ్మకానికి ఉంచామని, నాణ్యమైన కార్లు ప్రజల భద్రత దృష్టిలో ఉంచుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ కార్లని అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఈ అవకాశాన్ని నిజామాబాద్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ మేనేజర్ షాకీర్ భాషా, హర్ష ఫైనాన్స్ మేనేజర్ ప్రవీణ్, షో రూమ్ టీం లీడర్ హరీష్, రాము, మాజీ ఎంపీపీ భాస్కర్ రాజు, గురుచరణ్, షోరూం సిబ్బంది పాల్గొన్నారు.