నగరంలోని నీలకంఠేశ్వర ఆలయలం దీపకాంతులతో దేదీప్యమానంగా కనిపించింది. మహిళలు పెద్దసంఖ్యలో తరలి వచ్చి కార్తీక దీపాలు వెలిగించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని భారత జాగృతి ఆధ్వర్యంలో సోమవారం లక్ష దీపోత్సవంర్వహించారు. ముఖ్య అతిథిగా జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత హాజరై కోనేరు వద్ద దీపాలు వెలిగించారు.
జిల్లా ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. కార్తీక మాసం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమెకు మహిళలు బొట్టుపెట్టి ఆహ్వానించారు. దీపోత్సవంలో పాల్గొన్న యువతులతో ఎమ్మెల్సీ కవిత సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. జాగృతి ప్రధాన కార్యదర్శి నవీనాచారి, జిల్లా అధ్యక్షుడు అవంతి రావు, రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణ భరద్వాజ్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.