కోటగిరి. జనవరి 16: మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం ఆయన కోటగిరిలో వక్ఫ్బోర్డు నిధులు రూ.25 లక్షలతో చేపట్టనున్న మైనార్టీ శ్మశాన వాటిక ప్రహరీ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అనంతరం మండల కేంద్రంలోని మల్కాపూర్ శివారులో నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ బా లాజీ రైస్మిల్ను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..కేవలం కోటగిరి మండలంలోనే మైనార్టీల ఈద్గా, దర్గాల అభివృద్ధి కోసం రూ.10 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. పనులు కూడా త్వరగా ప్రారంభించాలని మైనార్టీ నాయకులకు సూచించారు.
వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. దీంతో పాటు ఐటీ రంగాన్ని కూడా ప్రోత్సహించి నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని చెప్పారు. ఉచిత విద్యుత్ అందించడంతో పాటు నిజాంసాగర్ కాలువల మరమ్మతులు చేయించి రెండు పంటలకు సాగు నీరందిసున్నట్లు తెలిపారు.
తెలంగాణలో అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా లేవన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజేశ్వర్, ఏసీపీ కిరణ్కుమార్, సర్పంచ్ పత్తి లక్ష్మణ్, జడ్పీటీసీ శంకర్పటేల్, జడ్పీ కో-ఆప్షన్ మెంబర్ సిరాజ్, వైస్ ఎంపీపీ గంగాధర్పటేల్, మండల కన్వీనర్ ఎజాజ్ఖాన్, ఏఎంసీ చైర్మన్ మహ్మద్ అబ్దుల్ హమీద్, వైస్ చైర్మన్ రాంరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ వల్లెపల్లి శ్రీనివాసరావు, రైతుబంధు సమితి మండల కన్వీనర్ కిశోర్బాబు, విండో చైర్మన్లు కూచి సిద్ద్దు, శాంతేశ్వర్పటేల్, హౌగీరావుపటేల్, బర్ల మధు, అనిల్ కులకర్ణి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మైనార్టీ నాయకులు అష్ఫాక్ హైమద్(పాషా) కలీం, సలీం, జుబేర్, బాబూఖాన్, నజీర్, చోటేమి యా, ఖలీల్, అమాన్ యూత్ సభ్యులు, ధనశ్రీ సు బ్బారావు, ప్రసాద్రావు తదితరులు పాల్గొన్నారు.