విద్యానగర్,మార్చి 22 : సీఎం కేసీఆర్ ఆడ పిల్లల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో దోమకొండ, కామారెడ్డి, బీబీపేట్, రాజంపేట్, రామారెడ్డి మండలాలకు చెందిన 266 మందికి (రూ.2 కోట్ల 66 లక్షల 30 వేల 856) కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంగళవారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ.. రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత కామారెడ్డి నియోజకవర్గంలో 6,539 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద రూ.64 కోట్ల 87 లక్షల 23 వేల 800 చెక్కులను పంపిణీ చేసినట్లు వివరించారు. ఆడపిల్ల పుడితే బాధపడే రోజులు పోయాయన్నారు. ఆడపిల్లలను మగ పిల్లలతో సమానంగా పెంచాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడపిల్లల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఇందుప్రియ, పట్టణ, వివిధ మండలాల టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.