బాన్సువాడ, డిసెంబర్ 23: ప్రేమతో ఇచ్చే కానుక ఏదైనా కోట్ల రూపాయలతో సమానమని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మంచి మనస్సుతో చేసే పనులకు దేవుడి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు.కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఓ ఫంక్షన్హాలులో శనివారం ముందస్తు క్రిస్మస్ సంబురాలు నిర్వహించగా..ముఖ్యఅతిథిగా పోచారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రిస్టియన్లతో కలిసి కేట్ కట్ చేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నియోజకవర్గంలోని వెయ్యి మందికి క్రిస్మస్ కానుకలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ..రాష్ట్రంలో కుల మతాలకు అతీతంగా పేదలను ఆదుకోవాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం క్రిస్మస్ పండుగకు ప్రతి ఏటా కానుకలను అందజేసిందని తెలిపారు. ప్రజలకు ఏమి కావాలో తెలుసుకొని వారికి సమకూర్చే బాధ్యత ప్రభుత్వాలు, నాయకులదని పేర్కొన్నారు. సమాజంలో పది మందికి సేవ చేయాల్సిన చేతు ఉండాలని, అదే చేతితో దోచుకుంటే చాలా బాధ కలుగుతుందన్నారు. బాన్సువాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. రైతులు, ప్రజలకు సాగు, తాగునీరు, విద్యుత్, వైద్య, విద్య రంగాల్లో నంబర్ వన్ స్థానంలో ఉంచినట్లు చెప్పారు.
నియోజవర్గంలో 11 వేల డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేశానని, ఇందులో సొం తిల్లు నిర్మించుకునేందుకు జీవో రాకపోయినా తాను ధైర్యంతో పనులు చేపట్టినట్లు తెలిపారు. 11 వేల ఇండ్లలో నాలుగు వేల ఇండ్లు పేదలకు కట్టించి ఇచ్చామని, మిగిలిన ఇండ్లు సొంత స్థలాల్లో కట్టుకున్నారని, వాటన్నింటికీ బిల్లులు మంజూరు చేసినట్లు వివరించారు. మందిరాలు, మసీదులు, చర్చిలకు నిధులు మంజూరు చేశానని తెలిపారు. కార్యక్రమం లో ఆర్డీవో భుజంగరావు, తహసీల్దార్ వరప్రసాద్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ నర్సింహులు, ఎంపీపీ దొడ్ల నీరజా వెంకట్రామ్ రెడ్డి, విండో చైర్మన్ ఏర్వాల కృష్ణారెడ్డి, గోపాల్ రెడ్డి, ఎజాస్, వా హబ్, పాస్టర్ ఏసుదాస్, జాన్వెస్లీ, ప్రశాం త్, థామస్, తార తదితరులు పాల్గొన్నారు.