రుద్రూర్/ఖలీల్వాడి/సిరికొండ/ చందూర్/శక్కర్నగర్/బాల్కొండ, జనవరి 30: జిల్లాలోని పలు గ్రామాల్లో గాంధీ వర్ధంతిని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రుద్రూర్ మండలకేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ శాంతి, అహింస, సత్యం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పారని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ శేఖర్, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధి విశ్వనాథ్ మహాజన్, కార్యదర్శి పురుషొత్తం, హరిరాం, వీరేశం, రాజు, సచిన్, పార్వతీ మురళి, ఆశ కార్యకర్తలు సిబ్బంది పాల్గొన్నారు.
నగరంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో ఆపార్టీ నాయకులు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ మాట్లాడుతూ.. భారతదేశ లౌకిక వ్యవస్థ కోసం ప్రతిఒక్కరూ కృషిచేయాలని అన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పుట్ట లక్ష్మణ్, సీపీఐ జిల్లా నాయకులు వై.ఓమయ్య, పి.ముత్యాలు, హన్మాండ్లు, రఘురాం, అంజలి, సుబోధ్ పాల్గొన్నారు.
సిరికొండ మండలంలోని సత్యశోధక్ పాఠశాలలో గాంధీ జయంతిని నిర్వహించారు. ప్రిన్సిపాల్ ఆర్.నర్సయ్య గాంధీ గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు.
చందూర్ మండలకేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో గాంధీ వర్ధంతిని నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ సాయారెడ్డి, ఉపసర్పంచ్ శేఖర్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
డిచ్పల్లి, జనవరి 30 : మండలంలోని ఏడో పోలీస్ బెటాలియన్లో కమాండెంట్ ఎన్వీ సత్యశ్రీనివాస్రావు ఆధ్వర్యంలో జాతీయ అమరవీరుల స్మారక దినోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. కమాండెంట్ సత్యశ్రీనివాస్రావు మాట్లాడుతూ.. ఎందరో మహానుభావులు బ్రిటీష్ వారితో పోరాడి తమ ప్రాణాలను అర్పించి మనదేశానికి స్వాతంత్య్రాన్ని తెచ్చి పెట్టారని అన్నారు. అంతకుముందు గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ సి.ఆంజనేయరెడ్డి, కె.భాస్కర్రావు, ఏవో సి.హంసారాణి, యూఎంవో డాక్టర్ అనుపమ, ఆర్ఐలు పి.వెంకటేశ్వర్లు, బి.అనిల్కుమార్, ఎం.నరేశ్, కె.శ్యామ్రావు, ఆర్.ప్రహ్లాద్, సి.సురేశ్, బి.వసంత్రావు, ఆర్ఎస్సైలు, సిబ్బంది, మినిస్ట్రియల్ స్టాఫ్ పాల్గొన్నారు.
బోధన్ పట్టణంలోని గాంధీ పార్కులో ఆయన విగ్రహానికి బోధన్ వాసవి క్లబ్, వనిత క్లబ్ ప్రతినిథులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.కార్యక్రమంలోవాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ గవర్నర్ మహాజన్ రాణి, ఆర్యవైశ్య సంఘం డివిజన్ ఇన్చార్జి కంటాల రమేశ్, మండల ప్రధాన కార్యదర్శి వాసర గంగాధర్, వాసవి క్లబ్, వనితా క్లబ్ ప్రతినిథులు ఎక్కపల్లి రామకృష్ణ, చింతల పద్మావతి, నాగరాజు, వసుశ్రీ, బిల్లకంటి అనీల్ కుమార్, నాగనాథ్, సత్యనారాయణ, వేణు, సుజాత తదితరులు పాల్గొన్నారు.
బాల్కొండ మండల కేంద్రంలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోఆప్షన్ సభ్యులు షాహిద్, సయ్యద్ మజర్, కృష్ణకాంత్, భూసం కిట్టు, చింటు, హయత్, ముత్తెన్న పాల్గొన్నారు.
కమ్మర్పల్లి మండల కేంద్రంలోని గాంధీనగర్ కాలనీలో కాంగ్రెస్ నాయకులు మహాత్మాగాంధీ వర్ధంతి నిర్వహించారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.