మంత్రి వేములకే మా ఓటు..
వేల్పూర్, అక్టోబర్ 29: మంత్రి ప్రశాంత్రెడ్డికి నియోజకవర్గంలో ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. కులాలు, మతాలకతీతంగా ఏకగ్రీవాల జోరు కొనసాగుతోంది. వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామ దేవాంగ సంఘం సభ్యులు, కమ్మర్పల్లి మండలం నాగపూర్ కురుమ, యాదవ సంఘ సభ్యులు మంత్రి వేములకే మా ఓటు అంటూ అంటూ ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. తీర్మానం కాపీలను మంత్రి వేములకు స్థానిక మండల నాయకులకు అందజేశారు. కులసంఘాల సభ్యులకు మంత్రి వేముల ధన్యవాదాలు తెలిపారు. పలువురు క్రిస్టియన్లు మంత్రి వేములను ఆశీర్వదిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భారీ మెజార్టీతో విజయం సాధించాలని ఆకాంక్షించారు.
సీఎం కేసీఆర్ జనరంజక పాలన, బాల్కొండ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మోర్తాడ్ మండల కేంద్రం తక్కూరివాడకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ యువకులు, మిత్రాస్ యూత్ సభ్యులు, దొన్కల్ గ్రామం నుంచి హనుమాన్ యూత్ అసోసియేషన్ యువకులు కాంగ్రెస్ మాజీ ఎంపీటీసీ లక్ష్మి పలువురు బీఆర్ఎస్లో చేరారు. బాల్కొండ మండలం చిట్టాపూర్ నుంచి కింగ్స్ యూత్, మహాశక్తి, అంబేడ్కర్ యూత్, పవర్ యూత్, గల్లీ బాయ్స్, వెషన్స్ యూత్, ఈగల్ యూత్, ప్రొఫెషనల్ యూత్, లీనోస్ పవర్, షైనింగ్ స్టార్స్, వినాయక్ యూత్కు చెందిననవీన్, రాజు, రాజేందర్, అన్వేష్, నరేశ్, అశ్వానంద్, లడ్డు నవీన్, రఘు, యూత్ సభ్యుల ఆధ్వర్యంలో సుమారు 300 మంది యువకులు మంత్రి వేముల సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. అభివృద్ధి వైపు ఉంటామనే యువత నిర్ణయం మంచి శుభపరిణామమని, తనకు వ్యక్తిగతంగా ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని మంత్రి వేముల అన్నారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
మోర్తాడ్, అక్టోబర్ 29: ధర్మోరా గ్రామాభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన మంత్రి ప్రశాంత్రెడ్డికి, పేదలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్కు, బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఉంటామని పేర్కొంటూ గ్రామస్తులు ఆదివారం సీఎం కేసీఆర్, మంత్రి ప్రశాంత్రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. గ్రామంలో సబ్స్టేషన్ ఏర్పాటు, బ్రిడ్జి, బీటీరోడ్లు, సీసీ రోడ్ల నిర్మాణం.. ఇలా కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి గ్రామాభివృద్ధికి కృషి చేశారని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మండల రాజేశ్వర్, సుధాకర్, దుగ్గెన రాజేందర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
ముప్కాల్ అక్టోబర్ 29: మంత్రి వేములకు సంపూర్ణ మద్దతు పలుకుతూ మండల కేంద్రానికి చెందిన వడ్డెర సంఘంలోని 98 కుటుంబాలు ఏకగ్రీవ తీర్మానం చేశాయి. అభివృద్ధి ప్రదాత వేముల ప్రశాంత్రెడ్డి వెన్నంటి ఉంటామని పేర్కొన్నారు.
ఆర్మూర్, అక్టోబర్29: ఆర్మూర్ మండలం అంకాపూర్లోని ఎమ్మెల్యే నివాసంలో ఆదివారం నందిపేట మండలం శాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు, ఆర్మూర్, పెర్కిట్ ముస్లిం యువకులు ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి జీవన్రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో మార్క్ఫెడ్ రాష్ట్ర చైర్మన్ మార గంగారెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పూజ నరేందర్, పండిత్ ప్రేమ్, జన్నపల్లి రంజిత్ పాల్గొన్నారు.
మాక్లూర్, అక్టోబర్ 29: మండలంలోని మాందాపూర్, వల్లభాపూర్, మధన్పల్లి, మెట్పల్లి గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు ఆశన్నగారి జీవన్రెడ్డి సమక్షంలో శనివారం రాత్రి బీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ పార్టీ మండల వైస్చైర్మన్ గడ్డం గంగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు రాంచందర్నాయక్, పెంటయ్య, వల్లభాపూర్ గ్రామానికి చెందిన సుదర్శన్, వంజరి సాయిలు, మాందాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు దిలీప్ పార్టీలో చేరగా ఎమ్మెల్యే జీవన్రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో అమ్రాద్ విండో చైర్మన్ శ్రీనివాస్గౌడ్, ఉపసర్పంచ్ మహేశ్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు శంకర్గౌడ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఇందల్వాయి, అక్టోబర్ 29 : మండలంలోని చాంద్రాయన్పల్లి, డిచ్పల్లి మండలంలోని రాంపూర్ పద్మశాలీ సంఘ సభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్కు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేశారు. తీర్మాన పత్రాన్ని డిచ్పల్లిలోని ఎస్ఎల్జీ గార్డెన్లో ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా చాంద్రాయన్పల్లి గ్రామసంఘ సభ్యుడు గంగదాస్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను చూసి మరోసారి పార్టీని గెలిపించుకునేందుకు ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో పద్మశాలీ సంఘ రూరల్ కన్వీనర్ చిలువేరి గంగదాస్, సభ్యులు శక్కరికొండ కృష్ణ, భవానీ నర్సయ్యతో పాటు రెండు గ్రామాల పద్మశాలీ సంఘ సభ్యులు ఉన్నారు.
ఖలీల్వాడి, అక్టోబర్ 29 : నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా సమక్షంలో 200 మంది బెంగాలీ స్వర్ణకారులు బీఆర్ఎస్లో చేరారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నగర మేయర్ దండు నీతూ కిరణ్, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సుజిత్ సింగ్ ఠాకూర్, బాలాదాస్ బెంగాలీ, షరీఫ్ బెంగాలీ, బబ్లూసింగ్ బెంగాలీ, రాకేశ్ బెంగాలీ, పసంగి బెంగాలీ, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
సిరికొండ, అక్టోబర్ 29 : మండలంలోని పందిమడుగు, దూప్యాతండా గ్రామాలకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు దాదాపు 50 మంది బీఆర్ఎస్లో చేరారు. వారికి డిచ్పల్లిలో బాజిరెడ్డి గోవర్ధన్ గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మాన్సింగ్, మాజీ సర్పంచ్ ఎంజీ నాయక్, మహేందర్, మదన్, రాజు పాల్గొన్నారు.