కుల వృత్తులకు కేసీఆర్ ప్రభుత్వం చేయూతను ఇస్తున్నది. దళితబంధు, గొర్రెల పంపిణీ, చేపపిల్లల పంపిణీ వంటి పథకాల ద్వారా అన్ని కులాలకు అండగా నిలుస్తున్నది. అదే క్రమంలో నాయీబ్రాహ్మణులు, రజకుల జీవితాలకు ‘వెలుగులు’ అందిస్తున్నది. 250 యూనిట్లలోపు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నది.
– ఆలూరు, మార్చి 23
ఆలూర్, మార్చి 2: ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. దీని ప్రభావం అన్ని రంగాలపై పడి ఉపాధి కోల్పోవాల్సిన దుస్థితి. ముఖ్యంగా చేతి వృత్తులపై ఆధారపడి బతికే నాయీబ్రహ్మణులు, రజకులైతే కరెంటు కోసం పడరాని పాట్లు పడేవారు. సెలూన్లు,లాండ్రీ షాపులు పెట్టుకొని జీవించే వారికి ఉమ్మడి రాష్ట్రంలో ఎలాంటి చేయూత లభించలేదు. గతంలో వాణి జ్య కేటగిరీలో ఉండడంతో నిర్వాహకులు కరెంటు బిల్లులతో సతమతమయ్యేవారు. స్వరాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి, అనేక సంస్కరణలు తెచ్చింది. అన్ని రంగాలకూ 24 గంటల పా టు నాణ్యమైన కరెంటు ఇస్తున్నది. సాగుకు పూర్తిగా ఉచితంగా ఇస్తుండగా, నాయీబ్రహ్మణులు, రజకుల కోసం ప్రతి నెలా 250 యూనిట్ల వరకు ఉచిత కరెంటు సరఫరా చేస్తున్నది.
ప్రభుత్వం అందిస్తున్న ఈ చేయూతతో సెలూన్లు, లాండ్రీ షాపులు, దోభీఘాట్లు, డ్రైక్లీనింగ్ షాపులు నడుపుకుంటూ జీవిస్తున్న కులవృత్తుల వారికి విద్యుత్ బిల్లుల భారం పూర్తిగా తొలగిపోయింది. దీంతో కేసీఆర్ తీసుకొచ్చిన ఉచిత విద్యుత్ పథకం వారికి కొండంత అండగా మా రింది. నాయీబ్రహ్మణులు నిర్వహించే సెలూన్ షాపులకు సగటున నెలకు రూ.1,500 వరకు కరెంట్ బిల్లు వచ్చేది. చిన్న చిన్న షాపులకు కూడా నిబంధనల ప్రకారం కమర్షియల్ కేటగిరీలో మీట ర్లు ఉండేవి. వీటికి ప్రత్యేకంగా బిల్లులు వేసేవారు. దీంతో ఏ చిన్న షాపు చూసినా కరెంటు బిల్లులు తడిసిమోపెడయ్యేవి. ఇటు రజకుల పరిస్థితి కూడా అంతే. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మిషన్లు వాడే డ్రైక్లీనింగ్ షాపుల్లో బిల్లులు పెద్ద మొత్తంలో వచ్చేవి.
కరెంట్ చార్జీలు చెల్లించలేక బొగ్గుల ఇస్త్రీ పెట్టెలతో రజకు లు ఇస్త్రీ చేసేవారు. ఈ బిల్లులు కూడా తడిసి మోపెడయ్యేవి. దేగాం సబ్స్టేషన్ పరిధిలోని గ్రా మాల్లో ఇప్పటి వరకు నాయీబ్రహ్మణులు, రజకులకు కలిపి మొత్తం 70 మీటర్లను అందజేశారు. వి జయవంతంగా అమలవుతున్న ఈ పథకంతో ఆయా వర్గాల ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నెలకు రూ.1500 మిగులుతున్నాయి
కష్టపడి పని చేస్తేనే మాకింత బువ్వ దొరుకుతది. ఎంత పని చేసినా కరెంటు బిల్లులు కట్టాలంటే ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు కరెంట్ బిల్లే లేకుంట పోయింది. ఎనిమిది నెలలసంది బిల్లే వస్తలేదు. బిల్లు ఇచ్చిపోతరు కాని జీరో బిల్లు ఉంటది. అప్పట్ల నెలకు రూ.400దాకా బిల్లు అస్తుండే. బొగ్గులకు రూ.1500 దాక అయితుండె. ఫ్రీ కరెంట్ ఇచ్చిన సంది కరెంట్ పెట్టెతోనే రోజుకు 45 జతల బట్టలు ఇస్త్రీ చేస్తున్న. కేసీఆర్ సార్ నెలకు 250 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇచ్చుడుతోని బిల్లు బాధ తప్పింది. నెలకు రూ.1500 దాకా మిగులుతున్నయి..
-మీరా గంగాధర్, రజకుడు, మిర్దాపల్లి, ఆలూర్ మండలం.
అందరికీ ప్రయోజనం
దేగాం క్లస్టర్ పరిధిలోని గ్రామాల్లో సెలూన్లు, లాండ్రీ షాపులకు 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ను అందిస్తున్నాం. సబ్సిడీ విద్యుత్తో అందరికీ ప్రయోజనం కలుగుతున్నది. ఆయా వర్గాలపై చాలా భారం తగ్గింది.
-శ్రావణ్ కూమార్, ఏఈ , దేగాం.