కామారెడ్డి జిల్లాలోని రహదారులు రక్తసిక్తమయ్యాయి. సోమవారం రాత్రి, మంగళవారం వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. కారు, బైకు ఢీకొని ఇద్దరు, బైక్, ట్రాక్టర్ ఢీకొని ఒకరు, లారీ, బైక్ ఢీకొని మరొకరు మృతిచెందారు.
పెద్దకొడప్గల్ మండలంలోని పోచారం చౌరస్తా వద్ద 161 నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం బైక్, కారు ఢీకొన్న ఘటనలో మహారాష్ట్రలోని దెగ్లూర్కు చెందిన వెంకటేశ్ శ్యాంబాజీ బన్సుడే (25), వాగ్మారే నిఖిల్(20) మరణించగా సూర్యవంశీ సోంనాథ్కు తీవ్రగాయాలయ్యాయి. పెద్దకొడప్గల్ మండలంలోని తలాబ్తండాలో ఇంటికి స్లాబ్ వేయడానికి ముగ్గురు బైక్పై బయల్దేదారు. పోచారం చౌరస్తా వద్ద వీరి బైక్ను హైదరాబాద్ నుంచి దెగ్లూర్ వైపునకు వెళ్తున్న కారు ఢీకొన్నది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కోనారెడ్డి తెలిపారు.
డోంగ్లీ మండలం వాడి గ్రామానికి చెందిన రాజు, వరుసకు కూతురు అయి న సాన్విక(6), చందుతో కలిసి బైక్పై సోమవారం రాత్రి మద్నూర్ నుంచి స్వ గ్రామానికి వస్తున్నారు. తడిహిప్పర్గా, లింబూర్ మధ్యలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొన్నది. ప్రమాదంలో సాన్విక అక్కడికక్కడే మృతిచెందగా.. రాజు, చం దుకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను నిజామాబాద్ దవాఖానకు తరలిం చి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మద్నూర్ ఎస్సై కృష్ణారెడ్డి మంగళవారం తెలిపారు.
కామారెడ్డి మండలంలోని టేక్రియాల్ గ్రామానికి చెందిన చీకోటి బుగ్గ రాములు(53) సదాశివనగర్ మండలంలోని కల్వరాల్ గ్రామంలో మంగళవారం జరిగిన తమ బంధువు అంత్యక్రియలకు వెళ్లాడు. తిరిగి బైక్పై వస్తుండగా.. సదాశివనగర్లోని 44వ జాతీయ రహదారిపై చెరుకు లోడ్తో వస్తున్న లారీ బైక్ను ఢీకొన్నది. ఈ ప్రమాదంలో రాములు అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రాజు తెలిపారు.