వినాయక నగర్, జనవరి 30: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నలుగురు సర్కిల్ ఇన్స్పెక్టర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు మల్టీజోన్ ఐజీ డాక్టర్తరుణ్ జోషి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ సౌత్ రూరల్ సీఐగా ఉన్న వెంకట నారాయణను నిజామాబాద్ ట్రాఫిక్ ఎస్హెచ్వోగా బదిలీ చేశారు.సిద్దిపేట కమిషనరేట్లో సీఐగా కొనసాగుతున్న బి.భిక్షపతిని నిజామాబాద్ జిల్లా ధర్పల్లి సీఐగా నియమించగా.. ధర్పల్లి సీఐ పి.సురేందర్ను నిజామాబాద్ సీసీఎస్కు బదిలీ చేశారు. మల్టీ జోన్-1 ఐజీ కార్యాలయంలో వెయిటింగ్లో ఉన్న ఎన్.సురేశ్కుమార్ నిజామాబాద్ సౌత్ రూరల్ సీఐగా నియమితులయ్యారు.