ముప్కాల్, ఫిబ్రవరి 21: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఉమ్మడి బాల్కొండ మాజీ జడ్పీటీసీ జోగు సంగీతానర్సయ్య వినూత్న కార్యక్రమం చేపట్టారు. ముప్కాల్ మండల కేంద్రంలో ఆడబిడ్డ పుట్టిన కుటుంబానికి తన సొంత డబ్బులు రూ.5వేలు ఇస్తానని మాట ఇచ్చారు.
ఇందులో భాగంగా ముప్కాల్లో ఓ చిన్నారి కుటుంబానికి బుధవారం రూ.5వేల డిపాజిట్ పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నర్సింగ్ దాస్ ఉన్నారు.