ఆర్మూర్టౌన్, మే 9: హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పి, తనను ఆశీర్వదించాలని నిజామాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రె స్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలకు వారెంటీ అయిపోయిందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన పట్టణంలోని ఆలూర్ రోడ్ నుంచి గోల్బంగ్లా వరకు మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డితో కలిసి రోడ్షో నిర్వహించారు.
ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఐదు నెలలైనా హామీలను నెరవేర్చలేదన్నారు. లోక్సభ ఎన్నికల్లో మరోసారి మోసగించేందుకు అబద్ధాలను ప్రచారం చేస్తూ, కుట్రలకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. రాష్ర్టానికి కేసీఆరే శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో సాగు, తాగు నీటి సమస్యలతో పాటు కరెంట్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి నిజస్వరూపాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. తాను పక్కా లోకల్ నాయకుడినని, తనను పార్లమెంట్కు పంపించాలని కోరారు.