కామారెడ్డి, మార్చి 6: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎల్ఆర్ఎస్ పెడితే అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు.. ఇప్పుడు ప్రజలపై రూ.20వేల కోట్ల భారం వేస్తున్నారని దుయ్యబట్టారు. ఎలాంటి ఫీజు లేకుండా ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అధికారంలోకి రాగానే రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటి వరకు రుణమాఫీ చేసిన పాపాన పోలేదని విమర్శించారు. ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. ధర్నాలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి, పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.