భిక్కనూరు, జూన్ 6: నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా భారీ ప్రమా దం నుంచి బయట పడ్డారు. శనివారం కుటుంబంతో కలిసి హైదరాబాద్ నుంచి నిజామాబాద్కు వస్తుండగా వారి కారును లారీ ఢీకొట్టింది. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకున్నది.
వెనుక నుంచి అతివేగంగా వచ్చి లారీ ఢీకొట్టడంతో బిగాల ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ పైకెక్కి సుమారు 50 మీటర్ల వరకు దూసుకెళ్లింది. కారు దెబ్బ తిన్నప్పటికీ, అందులో ప్రయాణిస్తున్న వారంతా సురక్షితంగా బయటపడ్డారు. అతివేగంగా నడిపి ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.