ఇందల్వాయి, జూన్ 21 : దివ్యాంగుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని, దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా రూ. 4,016 పెన్షన్ అందజేస్తూ అండగా నిలుస్తున్నారని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఇందల్వాయి మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో రూరల్ నియోజకవర్గంలోని దివ్యాంగులతో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడారు. సీఎం కేసీఆర్ దివ్యాంగుల బాగోగులు తెలుసుకొని, పెన్షన్ను పెంచి.. ఆర్థికంగా అండగా నిలుస్తున్నారన్నారు. దివ్యాంగుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారన్నారు. గతేడాది దివ్యాంగులకు 50 శాతం రాయితీతో రవాణా సౌకర్యం కల్పించారని తెలిపారు. ఈ ఏడాది 1300 మందికి సొంత డబ్బులతో రాయితీతో కూడిన కార్డులను అందజేశామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. బీజేపీ ప్రభుత్వం 15 లక్షల కోట్ల రూపాయలను బడా బాబులకు దోచిపెట్టిందని ఆరోపించారు. వారిని కాపాడేందుకు కల్లబొల్లి మాటలు చెబుతున్నారని అన్నారు. ప్రతిపక్ష నాయకులు ఎన్ని చెప్పినా నమ్మవద్దని అన్నారు. దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దివ్యాంగుల నియోజకవర్గ ఇన్చార్జి మహిపాల్రెడ్డి ఆర్టీసీ చైర్మన్కు వినతిపత్రాన్ని అందజేశారు.
పెన్షన్ను పెంచడాన్ని హర్షిస్తూ దివ్యాంగులు.. ఆర్టీసీ చైర్మన్తో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, ఎంపీపీ రమేశ్ నాయక్, వైస్ ఎంపీపీ బూసాని అంజయ్య, పీఏసీఎస్ చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్రెడ్డి, ఎంపీటీసీలు చింతలదాస్, సుధాకర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దాస్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు లోలం సత్యనారాయణ, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు శెట్టి బిరీశ్, రైతు బంధు సమితి మండల కన్వీనర్ మోహన్నాయక్, తహసీల్దార్ రోజా, సీనియర్ నాయకులు పాశం కుమార్, అరటి రఘు, పాశం నర్సింహులు, నరేశ్, గంగాదాస్, మొచ్చ గోపాల్, ఎడవెల్లి చిన్నముత్తన్న, ప్రవీణ్గౌడ్, సుధీర్, పరశురాం, నాగేశ్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.