శక్కర్నగర్, డిసెంబర్ 29 : బోధన్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో రెండో రోజూ ప్రజాపాలన దరఖాస్తు ఫారాల కొరత ఏర్పడింది. దీంతో జిరాక్స్ సెంటర్లు, మీ సేవ కేంద్రాలకు అనుకూలంగా మారింది. దరఖాస్తు ఫారాల కలర్ జిరాక్స్ను ఒక్కొక్కటి రూ. 50 చొప్పున విక్రయించారు. కలర్ జిరాక్స్లు అవసరం లేదని చెబుతున్నా.. కొందరు బయట మాత్రం కలర్ జిరాక్స్లే కావాలని ప్రచారం చేయడంతో జిరాక్స్ సెంటర్లు, మీ సేవ కేంద్రాల వద్ద రూ.50 చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. అయితే, అధికారులు మాత్రం కలర్ జిరాక్స్ పత్రాలు అవసరం లేదని.. తామే ఫారాలను ఆయా కేంద్రాల్లో అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టామని, ప్రజలు ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని అంటున్నారు.