ఏర్గట్ల, డిసెంబర్ 2 : మండలంలోని దోంచంద గ్రామంలో గురుంవారం నిర్వహించిన ఓ శుభకార్యంలో భోజనం వికటించి 20 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిని చికిత్స నిమిత్తం అర్మూర్ పట్టణంలోని ఓ వ్రైవేటు దవాఖానకు తరలించారు.
విషయం తెలసుకున్న మంత్రి ప్రశాంత్రెడ్డి బాధితులను శుక్రవారం పరామర్శించారు. ఒక్కొక్కరితో మాట్లాడి ధైర్యం చెప్పారు. వారి ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. మంత్రి వెంట డాక్టర్ మధుశేఖర్, తాళ్ల రాంపూర్ సొసైటీ చైర్మన్ పెద్దకాపు శ్రీనివాస్రెడ్డి ఉన్నారు.