మోర్తాడ్, జూన్ 4: నాలుగు రోజులుగా ఎస్సారెస్పీలోకి వరద క్రమంగా తగ్గింది. దీంతో ప్రాజెక్ట్లో నీటిమట్టం నిలకడగా ఉంటున్నది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి బుధవారం 672 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80.5టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం ప్రాజెక్ట్లో 1062.20 అడుగుల (12.788టీఎంసీల) నీరు నిల్వ ఉన్నది. ప్రాజెక్ట్ నుంచి కాకతీయకాలువకు వంద, మిషన్భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, 341క్యూసెక్కుల నీరు ఆవిరిరూపంలో వెళ్తున్నది.