నిజాంసాగర్, ఫిబ్రవరి 20: నిజాంసాగర్ ఆయకట్టు కింద సాగు చేస్తున్న పంటల కోసం ఐదో విడుత నీటి విడుదలను మంగళవారం ఉదయం ప్రారంభించినట్లు నీటి పారుదల శాఖ ఏఈ శివ ప్రసాద్ తెలిపారు. ప్రధాన కాలువ ద్వారా 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు పేర్కొన్నారు.
ఆయకట్టు కింద సాగు చేస్తున్న లక్షా 25వేల ఎకరాలకు ఇప్పటి వరకు నాలుగు విడుతల్లో 5.91 టీఎంసీల నీటిని విడుదల చేశామని, ప్రస్తుతం ఐదో విడుత విడుదల చేస్తున్నట్లు తెలిపారు. రైతుల అవసరాలకు అనుగుణంగా నీటి విడుదలలో మార్పులు ఉండొచ్చని అన్నారు. ప్రాజెక్టులో 1405.00 అడుగులు 17.80 టీఎంసీలకు 1398.60అడుగులు 9.91 టీఎంసీల నీరు నిల్వ ఉన్నదని పేర్కొన్నారు.