నిజామాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్కు వచ్చిన ఎమ్మెల్సీ కవితతో రైతులు, కూలీలు తమ గోడు వెల్లబోసుకున్నారు. వేస్ట్ ప్రభుత్వాలు రాజ్యమేలుతున్నాయని, రైతులను పట్టించుకుంటలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల నుంచి వచ్చిన రైతులతో పాటు నిర్మల్, జగిత్యాల జిల్లాల నుంచి పసుపు తీసుకొచ్చిన రైతులు తమ ఇబ్బందులను వివరించారు. బీజేపీ ఎన్నికలప్పుడు చెప్పినట్లు రూ.15 వేలు మద్దతు ధర అందుతుందా? అని కవిత ప్రశ్నించగా, రైతులంతా కేంద్ర సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపు రైతులతో కవిత మాటామంతి ఇలా..
రైతులు: అక్కా మాది కమ్మర్పల్లి. మా తాతల కాలం నుంచి పసుపు పండిస్తున్నం. ఇత్తనం నుంచి డ్రమ్ము పట్టే దాకా రైతులకు కష్టాలే మోపైనాయి. కనీస ధర అస్తలేదు. అడిగినా ఎవ్వలూ పట్టించుకుంటలేరు.
రైతులు: యాడ జరిగింది. బోర్డు తెచ్చామన్నారు. అది బోర్డుకే పరిమితమైంది. పసుపుబోర్డు యాడుందో. అదేందో ఏమో మాకు తెల్వదు. బోర్డు వచ్చింది కదాని ఆశతో ఉన్నం. ధర మంచిగా వస్తుందనుకుంటే దరిద్రంగా మారింది. క్వింటా పసుపునకు రూ.8 వేల ధర పెట్టడం పచ్చి మోసం.
రైతులు: ఏం జేసుడో ఏమో ఏం అర్థమైతలేదు. రూ.8వేలు ఇస్తే మాకు ఏ లెక్కన సరిపోతది. ఖర్చులకు సుతా సరిపోవు. మార్కెట్లో వ్యా పారులంతా సిండికేట్ అయ్యిండ్రు. పది మంది మోపైతుండ్రు. ముందే ఒక ధర అనుకుంటున్నారు. రైతుల కుప్పల వద్దకు వచ్చి అదే చెబుతున్నారు.
రైతులు: వాళ్లకు ఫిర్యాదు జేసినా పట్టించుకోరు. సిండికేట్ గాళ్లతోనే రైతులకు నష్టాలు మోపవుతున్నాయి. నాలుగైదు రోజులు వేచి చూస్తే కూ డా ధర రాక ఎక్కువ రోజులు మార్కెట్లో ఉండలేక రైతులు ఉట్టి చేతులతో వెళ్లలేక ఎంతకో కొంతకు దళారులకు అప్పగించాల్సి వస్తున్నది.
రైతులు: శివరాత్రికి పసుపు బాగా అత్తది. ఇంకా 80 శాతం పంట మార్కెట్కు రాలే. రైతులకు భయమైతన్నది. ధర లేక మార్కెట్కు అచ్చుడెందుకో అని బాధ పడుతున్నరు. శివరాత్రికి మహారాష్ట్ర నుంచి కూడా పసుపు అత్తే ధర మరింత పడిపోతది.
రైతులు: జై శ్రీరాం అనుడు తప్పా ఏం చేస్తలేరు. అంతా ఉత్త కథనే. రెండు సార్లు ఎంపీగా గెలిచిన అర్వింద్ ఒక్కసారి కూడా మార్కెట్కు రాలేదు. ఎన్నికలప్పుడు వస్తుండ్రు. పోతుండ్రు. ఏవేవో చెబుతుండ్రు.
మహిళా కూలీ: ఐదు రూపాయల బువ్వ దొరుకుతలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు సక్కగా ఉండే. ఇప్పుడు ఉపాసం ఉంటున్నం. మేము ఇప్పుడు లేము కదా. సర్కారు మారింది కదా. మార్పు అన్నారు. మార్పు జరిగింది. అన్నం బంద్ చేసిండ్రు.
రైతులు: అప్పుడే బాగుండే. సర్కార్ దవాఖానాల కూడా బువ్వ అందుతుండే. ఇప్పుడు ఎవ్వలకు అన్నం దొరుకుతలేదు.