కంఠేశ్వర్, ఫిబ్రవరి 26: నిజామాబాద్ మార్కెట్ యార్డులో మూడు రోజులుగా పసుపు కొనుగోళ్లు నిలిచిపోయాయి. మార్కెట్కు తెచ్చిన పసుపు పం ట యార్డులో పేరుకుపోయింది. దీంతో కొనుగోళ్లు చేపట్టాలని కోరుతూ రైతులు గురువారం ఆందోళనకు దిగారు. ఎందుకు కొనుగోళ్లు చేయడం లేదని అధికారులను నిలదీశారు. రైతులందరూ ఒకేసారి కార్యాలయంలోకి దూసుకెళ్లడంతో అక్కడ తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తోపులాటలో మార్కెట్ కమిటీ కార్యాలయ అద్దా లు ధ్వంసమయ్యాయి. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.
మూడు రోజులు గా ఈ-నామ్ దరఖాస్తు పనిచేయకపోవడంతో ప సుపు కొనుగోళ్లకు అంతరాయం ఏర్పడింది. పసు పు కొనుగోళ్లకు సంబంధించి ఈ-నామ్ ఆన్లైన్ దరఖాస్తు 1.0 నుంచి 2.0కు అప్గ్రేడ్ కావడంతో అది పనిచేయడం లేదు. దీంతో కొనుగోళ్లు స్తంభించాయి. ఈ విషయమై స్థానిక అధికారులు ఉన్నతా ధికారులను సంప్రదించగా.. వారం రోజులపాటు పాత దరఖాస్తులు ఉపయోగించాలని సూచించారు. దానికి అనుగుణంగా అనుమతులు ఇవ్వకపోవడంతో కొనుగోళ్లలో జాప్యం ఏర్పడింది.
మరోవైపు ప్రతికూల వాతావరణ పరిస్థితులు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడం, పసుపు కొనుగోలు చేయకపోవడంతో వారు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. దీంతో గురువారం ఒక్కసారిగా కార్యాలయంలోకి దూసుకెళ్లడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. నిలిచిపోయిన పసుపు కొనుగోళ్లను వెంటనే చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
నిజామాబాద్ మార్కెట్ యార్డులో బహిరంగ వేలం ద్వారా పసుపు కొనుగోళ్లు నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ సెలక్షన్ గ్రేడ్ సెక్రెటరీ అపర్ణ ఓ ప్రకటనలో తెలిపారు. మంగళవారం వరకు ఈ నామ్ 1.0లో క్రయ విక్రయాలు జరిపామని, అయితే, 25 నుంచి ఈ నామ్ 2.0 వర్షన్ అప్డేట్ చేయడం, ఈ నామ్ 1.0 నిలిపి వేయడంతో సాంకేతిక కారణాలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. దీంతో పసుపు కొనుగోళ్లలో అంతరాయం ఏర్పడిందని తెలిపారు. ఈ నామ్ 1.0ను పునఃప్రారంభించాలని కేంద్రాన్ని కోరగా ఆమోదించినప్పటికీ, గురువారం ఉదయం వరకూ అది పని చేయలేదన్నారు. అప్పటికే భారీగా పసుపు రావడంతో రైతుల శ్రేయస్సు దృష్ట్యా బహిరంగ వేలం ద్వారా కొనుగోళ్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.