– కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
వినాయక్నగర్, ఫిబ్రవరి 29: కాంగ్రెస్ పాలనతోనే రైతులు గ్రామాలను వదిలి పట్టణాలకు వలస వెళ్లాల్సిన దుర్గతి పట్టిందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. విజయసంకల్ప యాత్ర ముగింపు సందర్భంగా నిజామాబాద్ పాత కలెక్టరేట్ మైదానంలో గురువారం నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణలో రూ.2లక్షల కోట్లతో రోడ్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. మంచిర్యాల నుంచి ఆర్మూర్ వరకు హైవే రోడ్లు నిర్మిస్తున్నామన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, టీడీపీలే షుగర్ ఫ్యాక్టరీలను ప్రైవేటుపరం చేసి మూతపడేలా చేశాయని ఆరోపించారు. బీజేపీ యాత్ర ముగింపు సభకు జనాల నుంచి స్పందన కరువైంది. జనాలు లేకపోవడంతో ప్రాంగణం ఖాళీగా దర్శనమిచ్చింది. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, రాకేశ్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పాల్గొన్నారు.