ఒకనాడు కరెంట్ కోతలతో అల్లాడిపోయిన రైతులు ఇప్పుడు హాయిగా బతుకుతున్నారు. 24 గంటల ఉచిత విద్యుత్తో దర్జాగా పంటలు పండించుకుంటున్నారు. ప్రశాంతంగా సాగిపోతున్న రైతుల జీవితాల్లో కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు గుబులు రేపుతున్నాయి. మూడు గంటల కరెంట్ చాలని, 10హెచ్పీ మోటర్లు పెట్టుకోవాలంటున్న పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పాలనలో తాము అనుభవించిన విద్యుత్ కష్టాలను తలచుకొని కర్షకులు అల్లాడి పోతున్నారు. 24 గంటల కరెంట్ వృథా అంటున్న హస్తం పార్టీకి ఓటేస్తే మళ్లీ కటిక చీకట్లు తప్పవని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు, 10 హెచ్పీ మోటర్లు పెట్టాలన్న రేవంత్ వ్యాఖ్యలపై విద్యుత్ నిపుణులు తూర్పారబడుతున్నారు. అలా చేస్తే కరెంట్ సరఫరా వ్యవస్థ సర్వనాశనం అవుతుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పుడున్న మోటర్లు తీసి కొత్తవి పెడితే లక్షల్లో ఖర్చు వస్తుందని, అది ఎవరు భరిస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. కరెంట్ కష్టాలను తీర్చిన కేసీఆర్ వెంటే తామంతా నడుస్తామని, రైతుల నేస్తమైన కారు గుర్తుకే ఓటేసి గెలిపిస్తామని అన్నదాతలు చెబుతున్నారు.
Congress | రేవంత్రెడ్డి 3 గంటల కరెంట్ దేనికి సరిపోతది. 10 హెచ్పీ మోటరుగిన పెడితే .. నీళ్లు లేకపోతే అది మూలకు వడ్తది. అందరూ ఒక్కమారు 10 హెచ్పీ మోటర్లు చాలు జేస్తే దెబ్బకు ట్రాన్స్ఫారం కాలిపోతదని రేవంత్రెడ్డికి తెల్వదా..? మళ్ల్లా ట్రాన్స్ఫార్మర్ల రిపేరు కోసం ఉరుకువడుతది. 1000 మీటర్లకు నీళ్లు వడ్డ బోరుకే 10 హెచ్పీ మోటరు పెట్టాల. గిప్పుడు 100 మీటర్లకే మస్తుగ నీళ్లు ఉన్నయ్. 10 హెచ్పీ మోటరు పెట్టాల్నంటే మస్తు పైసల్ అయితాయి. కేసీఆర్ పాలనల అన్ని తీర్ల మంచి సౌలత్ ఉన్నది. మాకు మూడు గంటల కరెంట్ అద్దు.. ఆ కాంగ్రెస్ అద్దు, మాకు మంచిగ కరెంట్ ఇస్తున్న కేసీఆర్ సర్కారే కావాలా..
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యవసాయానికి కరెంట్ సరఫరాపై చేస్తున్న వ్యాఖ్యలు రైతుల్లో గుబులు రేపుతున్నాయి. రేపటి రోజున ఏమి జరుగబోతుందోననే గాబారా రైతాంగంలో ఏర్పడింది. 3 గంటల కరెంట్తో పంటలకు నీరు అందుతుందా అంటూ ప్రశ్నిస్తున్నారు. 3 గంటల కరెంట్తో తడిపిన మడే తడుస్తుంది.. పొలం అంతటా నీరు పారదు.. దీంతో కరెంట్ ఖర్చు ఎక్కువ అవుతుంది.. రైతుకు ఫాయిదా ఉండదు.. చివరి వరకు నీరు అందకపోతే.. అప్పట్ల పొలాలు ఎండిపోయినట్టే.. ఇప్పుడు కూడా అదే జరుగుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. అమ్మో.. కాంగ్రెస్ పాలన వద్దు.. మళ్లీ పాత చీకటి రోజులు వద్దూ.. అంటూ రేవంత్రెడ్డిని రైతులు శాపనార్థాలు పెడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ కష్టాలు తప్పవన్న నిర్ధారణకు రైతులు వచ్చారు. దీనికితోడూ పక్క రాష్ట్రంలో కర్ణాటకలో కాంగ్రెస్ పాలనలో కరెంట్ లేక రైతులు పడుతున్న పాట్లు ఇక్కడి రైతులు తెలుసుకుంటున్నారు. కర్ణాటకలో ఐదు గంటలపాటు కూడా కరెంట్ సరఫరా జరగడంలేదని అక్కడి రైతులు ఇటీవల కాలంలో ప్రపంచానికి తెలియపర్చారు. దీంతో కర్ణాటక కరెంట్ కష్టాలు మాకొద్దని రైతులు అంటున్నారు
రేవంత్రెడ్డి చెబుతున్నట్లు 10 హెచ్పీ మోటర్లు పెట్టుకోవడమన్నది ఆచరణ సాధ్యంకాదని విద్యుత్ ఇంజినీర్లు అంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఎక్కువగా 63 కేవీ డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. ఒక్కో ట్రాన్ఫార్మర్ కింద 12 నుంచి 15 బోరువెల్స్ ఉంటాయి. ఉమ్మడి జిల్లాలో 2 లక్షల 70 వేల బోరువెల్స్ ఉన్నాయి. జిల్లాలో 54,000 డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. ఇప్పుడు 10 హెచ్పీ మోటర్లు పెట్టాలంటే ఈ ట్రాన్స్ఫార్మర్ల సంఖ్య రెట్టింపు కావాలి. అంటే మరో 54,000 ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలి. ఈ భారం ఎక్కడి నుంచి మోస్తారు. ఒక్కో డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు అదనంగా మరో లక్ష రూపాయలు ఖర్చవుతుంది. అలాగే, సబ్ స్టేషన్లలోని పవర్ ట్రాన్స్ఫార్మర్ల సంఖ్యను పెంచాల్సి ఉంటుంది. అదనంగా సబ్ స్టేషన్ల ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.. ఇదంతా సాధ్యమయ్యే పనికాదని, విద్యుత్తు వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందని విద్యుత్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో రైతులకు కటిక చీకట్లను చూసిన అనుభవం ఉంది. నాటి కాంగ్రెస్ పాలనలో వ్యవసాయానికి సరిపడా కరెంట్ రాక రైతులు అష్టకష్టాలు పడాల్సివచ్చింది. ఒకసారి 9 గంటలపాటు కరెంట్ అని, మరోసారి 7 గంటల పాటు కరెంట్ అని కాంగ్రెస్ పాలకులు చెప్పినప్పటికీ, ఆచరణలో నాలుగైదు గంటల కరెంట్ కూడా ఇచ్చేదికాదు. దీంతో పంటలు ఎండిపోయి.. రైతులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు అనేకం.. కరెంట్ కోసం బోరువెల్స్ వద్ద పడిగాపులు పడాల్సివచ్చేది.. అర్థరాత్రి వేళల్లో పాము కాటుకు గురై అనేక మంది రైతులు చనిపోయేవారు. ఇక, కరెంట్ షాక్లతో కూడా రైతులు చనిపోయేవారు. ఇదంతా గమనించిన కేసీఆర్ అధికారంలోకి రాగానే, వ్యవసాయరంగానికి కరెంట్ సరఫరాలపై దృష్టిని కేంద్రీకరించారు. 24 గంటల ఉచిత కరెంట్తో రైతుల బతుకులు బాగుపడ్డాయ్.. తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నపూర్ణగా మారింది..
రైతులు బోరువెల్స్కు 10 హెచ్పీ మోటర్లు పెట్టుకోవాలంటే మోటర్తో పాటు క్లాంప్లు, పైపులు, వైరు తదితర పరికరాల ఖర్చుతో కలుపుకుంటే రూ.లక్ష వరకు ఖర్చవుతుంది. ఈ ఖర్చు ఎవరిస్తారన్న విషయం ఏ కాంగ్రెస్ నాయకుడు చెప్పడంలేదు. ఇంత పెద్ద మొత్తం తాము ఖర్చు పెట్టలేమని రైతులు అంటున్నారు. 3 గంటల విద్యుత్తుతో ఒకేసారి లోడ్ పెరిగి మోటర్లు కాలిపోతాయని రైతులు అంటున్నారు. ఇదే విషయాన్ని బోరువెల్ మెకానిక్లు చెబుతున్నారు. మొత్తంమీద కాంగ్రెస్ నాయకులు మళ్లీ కరెంట్ కష్టాలు తీసుకువస్తారన్న భయం రైతుల్ని వెన్నాడుతున్నది.
బోధన్, నవంబర్ 19: ‘ఇప్పుడు కరెంట్ తిప్పలు లేవు.. తెలంగాణ వచ్చినంక.. కేసీఆర్ పాలనలో మాకు కరెంట్ కష్టాలు తప్పినయ్.. పంటలకు 24 గంటలపాటు నాణ్యమైన కరెంట్ అందుతున్నది.. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోకచ్చినయ్.. రిపేర్ల కోసం కరెంట్ ఆఫీసుల చుట్టూ.. ట్రాన్స్ఫార్మర్ల రిపేరింగ్ సెంటర్ల చుట్లూ రోజుల తరబడి తిరిగే తిప్పలు లేవు.. రేవంత్రెడ్డి 3 గంటల కరెంట్ చాలని, 10 హెచ్పీ మోటర్లు పెట్టుకోవాలని చెబుతుండడంతో రైతులు గాబారా అవుతున్నరు.. కాంగ్రెసోళ్ల పాలనలో కరెంట్ కోసం పడ్డ తిప్పలు మళ్లీ రావద్దు.. అప్పుడు 9 గంటల ఉచిత విద్యుత్తు అని చెప్పి నాలుగు గంటలు ఇచ్చేవారు.. అది కూడా ఆపుకుంటూ.. ఆపుకుంటూ ఇస్తుండె.. రాత్రుళ్లు పొలాల వద్ద పడిగాపులు ఉంటిమి.. పాముకాట్లకు, కరెంట్ షాక్లకు మా రైతుల పాణాలు పోయినయ్..’ అని రైతులు అంటున్నారు. కాగా, ‘10 హెచ్పీ మోటర్లు ఏమిటి.. ఇవేం మాటలు.. విద్యుత్తు వ్యవస్థ సర్వనాశనం అవుతుంది.. ఇప్పుడున్న ట్రాన్స్ఫార్మర్లను రెట్టింపు చేసుండంటే.. అంతా వృథా ఖర్చు.. మళ్లీ చీకటి రోజులు వస్తాయంటూ విద్యుత్తు నిపుణులు, ఇంజినీర్లు, రిటైర్డ్ ఇంజినీర్లు, మేధావులు అంటున్నారు. రేవంత్రెడ్డి ఇలా ఎందుకు మాట్లాడుతున్నారంటూ వారు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ఇక, బోరువెల్ మెకానిక్లు సైతం రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై నవ్వుకుంటున్నారు.. 10 హెచ్పీ మోటర్లు పెడితే లోవోల్జేజీతో కాలిపోతాయ్.. ఇప్పుడున్న 5 హెచ్పీ మోటరు స్థానంలో 10 హెచ్పీ మోటరు పెట్టాలంటే లక్ష రూపాయల వరకు ఖర్చవుతుంది.. ఇదంతా సాధ్యమా..’ అంటూ రేవంత్రెడ్డిది బుర్రతక్కువ ఆలోచనలని వారు అంటున్నారు. ఇలా ప్రతి ఒక్కరూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యవసాయ రంగానికి కరెంట్ సరఫరాకు సంబంధించి చేస్తున్న రచ్చను ఘంటాపథంగా వ్యతిరేకిస్తున్నారు. 3 గంటల కరెంటూ వద్దూ.. కాంగ్రెస్ పాలన వద్దూ అంటూ రైతాంగంలో నిరసన ధ్వనులు వినిపిస్తున్నాయి.
నవీపేట,నవంబర్ 19: కాంగ్రెసోళ్లు చె బుతున్నట్లు మూడు గంటల కరెంటు ఇ స్తే మళ్లీ మేము రోడ్డెక్కే పరిస్థితి వస్తుంది. మూడు గంటల కరెంట్ సరఫరాతో కనీ సం ఎకరం పొలం సైతం తడిచే పరిస్థితి ఉండదు. 10 హెచ్పీ మోట ర్ పెడితే భూగర్భ జలాలు అడుగంటి పోతాయి. ఈ మోటర్ కొన్నాలన్నా రూ. 50 వేల పైగా ఖర్చు అవుతుంది. కానీ ప్రయోజనం మాత్రం ఏం ఉండదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉచితంగా కరెంట్ సరఫరా చేస్తుంది కాబట్టి బిల్లులతో రైతులకు బాధలు లేవు. గతంలో టీడీపీ హయాంలో ఏడు గంటల కరెంట్ సరఫరాలో కోతలతో మస్తు తిప్పలు పడ్డాం. ఇప్పుడు 24 గంటల కరెంటుతోటి పంటలు మంచిగ పడుతున్నాయి.
పొలాల్లో 10 హెచ్పీ మోటర్ ఎవ్వళ్లూ వాడరు. 2 వేల ఫీట్ల లోతు వరకు బోరు డ్రిల్లింగ్ చేస్తే తప్ప ఇది వాడరు. జిల్లాలో ఎక్కడ చూసిన భూమిలో రెండున్నర, మూడు ఇంచుల కన్నా ఎక్కువ నీరు లేదు. ఈ నీటిని తోడేందుకు 5 హెచ్పీ మోటర్ సరిపోతుంది. 10 హెచ్పీ మోటర్ వాడితే భూమి లో ఊటలు రాక భూగర్భ జలాలు అడుగంటి పోవడం ఖాయం. రేవంత్రెడ్డి అడ్డదారిన అధికారంలోకి రావడానికి సాధ్యం కాని హామీలను గుప్పిస్తున్నాడు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉచితంగా కరెంట్ను సరఫరా చేస్తుంది కాబట్టి విద్యుత్ బిల్లు బాధ రైతులకు లేదు. టి. గోపి, సబ్మెర్సిబుల్ మోటర్ మెకానిక్, నవీపేట..
నేను 10 ఎకరాల వరి పంట సాగు చేస్తు న్నా. గతంలో సాగు చేసిన పంటలకు నీటి తడులు అందించేందుకు రాత్రుళ్లు సైతం మోటర్ వద్ద నిద్ర చేసేవాడిని. కరెంట్ ఎప్పుడు వస్తుందో..ఎప్పుడు పోతుందో తెలియక నానా ఇబ్బందులు పడేవాడిని. గత ప్రభుత్వ హయాంలో కరెంట్ కష్టాలు తీవ్రంగా ఉండేవి. సింగిల్ ఫేస్ కరెంట్ సరఫరా చేసేవారు.. అదికూడా రాత్రి పూట వచ్చేది. వచ్చిన కొద్దిపాటి నీటితో పంటలకు సరిపోక నానా ఇబ్బందులు పడేవాళ్లం. సీఎం కేసీఆర్ సర్కార్లో నిరంతరం ఉచిత విద్యుత్ అందిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత కరెంట్ సరఫరా చేస్తున్నారు. ఇప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేవు..
కోటగిరి నవంబర్ 19 : రేవంత్రెడ్డి అన్నట్లు మూడు గంటల కరెంటుతో ఒక్క మడి అయినా తడుస్తుందా..? ఈ విషయం ఆయనకు తెలుసా.. నేను ఐదెకరాల భూమిలో వ్యవసాయం చేస్తున్నా.. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న 24 గంటల పాటు ఉచిత విద్యుత్తో నాణ్యమైన పంటలు పండించుకుంటున్నాం. కాంగ్రెసోళ్ల మాటలతో మళ్లీ తిరిగి పాత రోజులే వస్తాయంటేనే భయం వేస్తోంది. అప్పట్ల రాత్రి పూట కరెంటుతో పొలాలకు పరుగులు పెట్టేవాళ్లం.. అనాడు కష్టాన్ని చూశాం. ఈనాడు సౌలభ్యాన్ని చూస్తున్నాం.
రాష్ట్రంలో వ్యవసాయ బోరువెల్కు ఇప్పుడున్న 5 హెచ్పీ మోటర్ స్థానంలో 10 హెచ్పీ మోటర్ పెట్టడమనే ఆలోచన పూర్తిగా అర్థరహితం.. ఎన్నో ఏండ్లుగా ఏర్పాటు చేసుకుంటూ వస్తున్న విద్యుత్ పంపిణీ వ్యవస్థను ధ్వంసం చేయడమే. 10 హెచ్పీ మోటర్లు పెడితే ఇప్పుడున్న డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్ఫార్మర్ల సంఖ్యను రెట్టింపు చేయాలి.. అంటే ఒక్కో డిస్ట్రిబ్యూటరీ ట్రాన్ఫార్మర్పై రూ.లక్ష ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. 10 హెచ్పీ మోటర్లు, 3 గంటల కరెంట్ అని చెబుతుండడం అవగాహన రాహిత్యమే. 3 గంటల కరెంట్తో అధిక లోడ్ పడి మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతాయి.. పైగా, లైన్ లాసెస్ ఎక్కువగా ఉండి విద్యుత్తును నష్టపోవాల్సి ఉంటుంది. ఇప్పుడున్న 24 గంటల కరెంట్ వల్ల లైన్ లాసెస్ బాగా తగ్గిపోయింది. దీంతో ప్రభుత్వానికి ఏటా రూ.550 కోట్లు మిగులుతున్నాయి. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన విద్యుత్తు పంపిణీ వ్యవస్థ కోసం రూ.1500 కోట్లు ఇచ్చారు. అంతకుముందు ఏ పాలకులు కూడా ట్రాన్స్కోకు రూపాయి ఇవ్వలేదు..
బీబీపేట్, నవబంర్ 19: సీఎం కేసీఆర్ మా కష్టాలను గుర్తెరిగి ఇబ్బందులు లేకుం డా చేసిండు. 24 గంటలు కరెంట్తో పా టు రైతుబంధు, రుణమాఫీ అమలు చే స్తుండు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి రైతులకు కేవలం 3 గంటల కరెంటు సరిపోతుందని అనడం సిగ్గుచేటు. 10 హెచ్పీ మోటర్లు పెట్టుకుటే దాదాపు రూ. లక్ష వరకు ఖర్చు అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి పొరపాటున ఓటు వేసి మళ్లీ కష్టాలు కొనితెచ్చుకోవద్దు.