లింగంపేట, ఫిబ్రవరి 27: బోనాల్ గ్రామానికి డబుల్ బెడ్ రూం ఇండ్లతోపాటు దళితబంధు యూనిట్లు మంజూరు చేస్తామని ఎల్లారెడ్డి ఎమ్మె ల్యే జాజాల సురేందర్ అన్నారు. సోమవారం ఆయన మండలంలోని బోనాల్ గ్రామంలో నిర్వహిస్తున్న బీరప్ప ఉత్సవాలతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రూ.30లక్షలతో చేపట్టిన బీటీ రోడ్డు, రూ.10లక్షలతో నిర్మించిన సీసీ డ్రైన్స్, రూ.25లక్షలతో చేపట్టిన సీసీ రోడ్లు, రూ.8.50లక్షలతో నిర్మించిన 125 టన్నుల సామర్థ్యం గల గోదామును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నట్లు చెప్పారు. బీరప్ప ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన.. వర్షాలు సమృద్ధిగా కురియడంతోపాటు పాడి పంటలు బాగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అంతకుముందు భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. గ్రామంలో తిరిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ గరీబున్నీసాబేగం, సర్పంచ్ కలాలి సుశీల, ఎంపీటీసీ కేతావత్ తులసీ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్, ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిద్ధిరాంరెడ్డి, లింగంపేట సహకార సంఘం చైర్మన్ దేవేందర్రెడ్డి, వైస్ చైర్మన్ మాకం రాములు, పీఆర్ డీఈఈ గిరి, మండల పరిషత్ కో-ఆప్షన్ సభ్యుడు బాబుజానీ, ఏఐబీఎస్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు గన్నూ నాయక్, బీఆర్ఎస్ యూ త్ మండల అధ్యక్షుడు నరేశ్, నాయకులు నయీం, నరహరి, సాయాగౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.