TNGO | కంఠేశ్వర్, నవంబర్ 20 : కాలపరిమితి ముగిసిన కమిటీలకు ఎన్నికలు నిర్వహించాలని టీఎన్జీవో నేతలు సూచించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో కార్యాలయంలో ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ అధ్యక్షతన, టీఎన్జీవో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో తెలంగాణ గేయ రచయిత, ప్రముఖ పాత్రికేయులు స్వర్గీయ అందేశ్రీ , టీఎన్జీవో మహిళా జిల్లా ఉపాధ్యక్షురాలు మంజుల మాతృమూర్తి యశోద, అనారోగ్య సమస్యలతో మెడికల్ అండ్ ఫోరం జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ మృతి చెందారు. కాగా వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, టీఎన్జీవో జిల్లా కార్యవర్గ సమావేలో రెండు నిమిషాలు మౌనం పాటించారుజ అనంతరం సుమన్ కుమార్ మాట్లాడుతూ కాల పరిమితి (టెన్యూర్ పీరియడ్) దాటిన అన్ని శాఖల ఫోరంలకు ఎన్నికలు సత్వరమే నిర్వహించుకోవాలని చెప్పారు. టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఈనెల 22న టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎస్ఎం హుస్సేని (ముజీబ్) ముఖ్య అతిథుల ఆధ్వర్యంలో టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని టీఎన్జీవో జిల్లా కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కాగా అన్ని శాఖల ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరై టీఎన్జీవో సభ్యత్వాన్ని స్వీకరించాలని కోరారు.
ఉద్యోగుల సమస్యలపై టీఎన్జీవో రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు జిల్లా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబోయే కార్యక్రమాలకు ఉద్యోగులందరూ కలిసి రావాలని కోరారు. ఈ సమావేశానికి టీఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, జిల్లా సహాధ్యక్షుడు పెద్దోళ్ల నాగరాజు, కోశాధికారి దినేష్ బాబు, టీఎన్జీవో వివిధ యూనిట్ శాఖల అధ్యక్ష కార్యదర్శులు జాకీర్ హుస్సేన్, జ్ఞానేశ్వర్ రెడ్డి, సృజన్ కుమార్, మారుతి, శ్రీనివాస్, విశాల్, టీఎన్జీవో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ స్పెషల్ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు సూర్యప్రకాష్, సతీష్ కుమార్, టీఎన్జీవో జిల్లా ఉపాధ్యక్షులు మాణిక్యం, శివకుమార్, అతిక్, సునీత, మంజుల, శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి ప్రకాష్, నటరాజ్, సాంస్కృతిక కార్యదర్శి ఆఫీస్ సెక్రటరీ లక్ష్మీనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు భూమయ్య, విజయలక్ష్మి, సునీల్, స్వామి, టీఎన్జీవో ముఖ్య సలహాదారులు వనమాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.