ధర్పల్లి, నవంబర్ 18 : కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 50 ఏండ్లలో చేయని అభివృద్ధిని బీఆర్ఎస్ వచ్చాక పదేండ్లలోనే చేసి చూపించామని రూరల్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మండలంలోని వాడీ, హోన్నాజీపేట్, కోటాన్పల్లి, నడిమితండా, గుడితండా, సీతాయిపేట్, మొబీన్సాబ్తండా, చెరువుతండా, గోవింద్పల్లి తదితర గ్రామాల్లో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆయా గ్రామాల్లో బాజిరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ చేసింది శూన్యమని, కేసీఆర్ పుణ్యమా అని తెలంగాణ నేడు నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. రైతులకు రూ. 17వేల కోట్ల రుణం మాఫీ చేశామని, మిగిలినవారికి త్వరలో మాఫీ అవుతుందన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే డ్వాక్రా మహిళలకు రూ.15 లక్షల వడ్డీ లేని రుణాలు, పేదలకు రూ. 400 లకే సిలిండర్ అందజేస్తామన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి భూపతిరెడ్డి స్వలాభం కోసమే సానుభూతి మాటలు మాట్లాడుతున్నాడని బాజిరెడ్డి మండిపడ్డారు. ఆయన ప్రజలకోసం చేసిందేమీ లేదన్నారు. నిజామాబాద్లో ఆస్తులను అమ్ముకొని హైదరాబాద్లో కొన్నాడని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ మాటలు నమ్మి మోసపోవద్దని పిలుపునిచ్చారు. బడ్జెట్ ఎలా తెస్తాడో రెవంత్రెడ్డి చెప్పకుండా మభ్యపెట్టే హామీలు ఇస్తున్నాడని దుయ్యబట్టారు. డబ్బులు నీ తాత జాగీరా అన్ని ప్రశ్నించారు. తల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు కడియం చేయిస్తామన్నట్లుగా పీసీసీ వ్యవహారం ఉన్నదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్కు ఓటేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మద్దుల్తండాలో పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు బాజిరెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ప్రచారంలో జడ్పీటీసీ జగన్, ఎంపీపీ సారికా హన్మంత్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు రాజ్పాల్రెడ్డి, ధర్పల్లి సర్పంచ్ పెద్దబాల్రాజ్, కో-ఆప్షన్ సభ్యుడు అబ్దుల్ మాజిద్, నాయకులు సురేందర్గౌడ్, హన్మంత్రెడ్డి, కిశోర్రెడ్డి, నజీర్, రంజిత్, దాసు, పోతరాజు,సురేశ్, లింగం, సొసైటీ చైర్మన్లు చిన్నారెడ్డి, రాజేందర్రెడ్డి, ప్రజాప్రతినిదులు పాల్గొన్నారు.