Election boycott | రామారెడ్డి : రామారెడ్డి మండలం గోకుల్ తండా (2)లో సర్పంచ్ ఎన్నికలో ఓటర్లు ఎన్నికలను బహిష్కరించారు. తాండ కు చెందిన దాదాపు 250 కి ఫై గా ఓటర్లు మా గ్రామంలో మాకు పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలని పలుమార్లు అధికారులను వేడుకున్నారు. అయినా అధికారులు స్పందించక పోవడంతో తాండావాసులు ఎన్నికలను బహిష్కరించారు.
దీంతో స్పందించిన కామారెడ్డి ఆర్డీవో వీణ గ్రామానికి చేరుకుని తండావాసులతో చర్చించారు. అయినా తండావాసులు ఓట్లు వేయమని నిరాకరించారు. అలాగే పోలింగ్ కేంద్రాన్ని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సందర్శించారు.