రంజాన్ వేడుకలను ఉమ్మడి జిల్లాలో ముస్లింలు గురువారం ఘనంగా జరుపుకొన్నారు. ఈద్-ఉల్-ఫితర్ పర్వదినం సందర్భంగా మసీదులు, ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. బాన్సువాడలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, వేల్పూర్లో మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనార్టీలకు శుభాకాంక్షలు తెలిపారు.