వర్ని : మార్కెట్ కమిటీ పరిధిలోని రైతులకు సౌకర్యాలు మెరుగుపరచడానికి కొత్త పాలకవర్గం కృషి చేయాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడు పోచారం భాస్కర్ రెడ్డి సూచించారు. వర్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్పర్సన్గా మూడ్ కవిత, వైస్ చైర్మన్గా వెలగపూడి గోపాల్ ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భాస్కర్రెడ్డి కొత్త పాలకవర్గాన్ని అభినందించి, సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు పక్షపాతి అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారన్నారు.
మార్కెట్ కమిటీ ద్వారా రైతులకు అందించాల్సిన సేవలను సైతం అందించి వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో వర్ని ఎంపీపీ మేక శ్రీలక్ష్మీవీరాజు, వైస్ ఎంపీపీ దండ్ల బాలరాజు, కో ఆప్షన్ సభ్యుడు కరీం, వర్ని సహకార సంఘం అధ్యక్షుడు నామాల సాయిబాబ, రుద్రూరు జట్పీటీసీ సభ్యుడు నరోజి గంగారాం, టీఆర్ఎస్ నాయకులు మేక వీరాజు, అక్కపల్లి నాగేందర్, వర్ని, చందూరు, రుద్రూరు మండల అధ్యక్షులు కల్లాలి గిరి, మూడ్ అంబర్సింగ్, పత్తి లక్ష్మణ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గోవింద్ రావ్, అబ్దుల్ గఫార్, ఈబితి రామాగౌడ్, వసియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.