బాన్సువాడ రూరల్, మార్చి 30: అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ సోమవారం బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామం లో బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సీఎం డౌన్డౌన్ అంటూ నినాదాలు చేశారు.
ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, మంత్రుల అవినీతిపై చర్యలు చేపట్టాలని అసెంబ్లీలో ప్రశ్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సమాధానం చెప్పాల్సింది పోయి సభ నుంచి సస్పెండ్ చేయడం సిగ్గుచేటని విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలే రాష్ట్రం నుంచి బహిష్కరిస్తారన్నారు. బీఆర్ఎస్ నాయకులు మన్నె అనిల్, మమ్మయి లక్ష్మణ్, దొంతుల రాజ్కుమార్, గంగారాం, జోగోళ్ల హన్మాండ్లు, రమేశ్, రాజు, నల్లోల సాయిలు, గుడిసెల సాయిలు తదితరులు పాల్గొన్నారు.