ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈస్టర్ సండే వేడుకలను క్రైస్తవులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పాస్టర్లు ఈస్టర్ సండే ప్రాశస్త్యాన్ని వివరించారు. నిజామాబాద్ నగరంలోని సీఎస్ఐ చర్చి ఆవరణలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.