బిచ్కుందలో డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే షిండే
బిచ్కుంద, మే 26 : రాష్ట్రంలోని నిరుపేదలందరికీ కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించి ఇస్తున్నట్లు జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. మండలంలోని మ ల్కాపూర్ శివారులో 15 మంది బీడీ కార్మికులకు మంజూరుచేసిన డబుల్ బెడ్ రూం ఇండ్లను ఎమ్మెల్యే గురువారం ప్రారంభించారు. అనంత రం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని అన్నారు.
జుక్కల్ నియోజకవర్గం లో అర్హులైన నిరుపేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లను మంజూరుచేస్తామన్నారు. సొంతస్థలం ఉన్నవారు ఇంటి నిర్మాణం చేపడితే ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తుందని తెలిపారు. దళితుల ఆర్థికాభ్యున్నతి కోసం దళితబంధు అమలుచేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ అశోక్పటేల్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్రావు, ఏఎంసీ చైర్మన్ మల్లికార్జున్ పటేల్, జడ్పీటీసీ భారతీరాజు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.