రైతులు ఏమాత్రం అధైర్యపడొద్దని, గంట భూమి కూడా పోనివ్వబోమని కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి హామీ ఇచ్చారు.
గుంట భూమికూడా పోనివ్వం
కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్నిట్టు జాహ్నవి
విద్యానగర్, జనవరి 20 : రైతులు ఏమాత్రం అధైర్యపడొద్దని, గంట భూమి కూడా పోనివ్వబోమని కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి హామీ ఇచ్చారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో అత్యవసర సర్వసభ్య సమావేశం నిర్వహించి కామారెడ్డి డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ను రద్దుచేస్తూ తీర్మానం చేయగా, సభ్యులంతా ఆమోదించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాహ్నవి మాట్లాడారు… మాస్టర్ప్లాన్తో వ్యవసాయ భూములకు నష్టం జరుగనివ్వబోమని స్పష్టం చేసినప్పటికీ ప్రతిపక్ష పార్టీలు రైతులను తప్పుదోవ పట్టించాయని అన్నారు. మాస్టర్ ప్లాన్పై స్పష్టత ఇచ్చేందుకే సర్వసభ్య సమావేశం నిర్వహించినట్లు చెప్పారు.
డిజైన్ డెవలప్మెంట్ ఫోరమ్ ఇచ్చిన మాస్టర్ప్లాన్ను రద్దు చేస్తున్నట్లు మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానించామని తెలిపారు. తాము రెసిడెన్షియల్ జోన్గా మాస్టర్ప్లాన్ను రూపొందిస్తే.. వారు దానిని ఇండస్ట్రియల్ జోన్గా మార్చి పంపారని తెలిపారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామన్నారు. రైతులు, ప్రజల అభిప్రాయం మేరకే కామారెడ్డి మాస్టర్ ప్లాన్ను రూపొందిస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసమే పని చేస్తుందని అన్నారు. అన్నదాతలకు వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమాలు ఉండబోవని తెలిపారు. ప్రతిపక్ష నాయకులు రెచ్చగొట్టి ఆందోళనలు చేయించారని, వారి మాటలను నమ్మి మోసపోవొద్దన్నారు. రైతులు సంయమనం పాటించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఇందూప్రియ, కమిషనర్ దేవేందర్, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.