బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన టీఆర్ఎస్కు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తున్నది. పార్టీ బలోపేతం కోసం విరాళాలు ఇచ్చేందుకు జనం స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. వేల్పూర్ మండలం పడగల్ గ్రామస్తులు బుధవారం రూ.46 వేల నగదును గులాబీ పార్టీ నాయకులకు విరాళంగా అందజేశారు.
వేల్పూర్, అక్టోబర్ 19 : మండలంలోని పడిగెల గ్రామంలో బుధవారం బీఆర్ఎస్ పార్టీకి స్థానికులు స్వచ్ఛందంగా విరాళాలు అందజేశారు. సీఎం కేసీఆర్ నూతనంగా స్థాపించిన బీఆర్ఎస్ పార్టీకి అన్ని గ్రామాల ప్రజల నుంచి ఆదరణ లభిస్తున్నదని సర్పంచ్ ద్యావతి వర్ధిని అన్నారు. గ్రామస్తులు బీఆర్ఎస్కు స్వచ్ఛందంగా రూ.46,200 విరాళాలు అందజేశారని తెలిపారు.కార్యక్రమంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) నాయకులు శ్యామ్రావు, ఉపసర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, రాజ్కుమార్ పాల్గొన్నారు.
పడిగెల గ్రామంలో విరాళాలు అందజేస్తున్న గ్రామస్తులు