ఖలీల్వాడి, సెప్టెంబర్ 29 : తొమ్మిదేండ్లలో ఇందూరు సుందర నగరంగా మారిందని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. శుక్రవారం ఆయన నగరంలోని 34,44, 45, 49వ డివిజన్లలో పర్యటించారు. 34వ డివిజన్ మిర్చి కాంపౌండ్లో కోటి రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులను ప్రారంభించారు. రూ.10లక్షలతో నిర్మిస్తున్న మహిళా భవనానికి భూమిపూజ చేశారు. 44వ డివిజన్లో పూసలగల్లీ, 49వ డివిజన్ అంబర్పేట్, 45వ డివిజన్ వినాయక్నగర్లో కోటి రూపాయల చొప్పున చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ, కల్వర్టుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బిగాల మాట్లాడుతూ.. 60 ఏండ్ల వెనుకబాటును కేవలం తొమ్మిదేండ్లలో అధిగమించామన్నారు.
గత పాలకుల హయాంలో అభివృద్ధికి నోచుకోని నిజామాబాద్ నేడు కొత్త హంగులతో కనిపిస్తోందని తెలిపారు. నగరం నలు దిక్కులా విశాలమైన రోడ్లు, ఆకర్షణీయమైన చెట్లతో సుందరంగా తీర్చిదిద్దామన్నారు. కేసీఆర్ దార్శనిక పాలనలో అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం దేశానికి దిక్సూచిగా మారిందన్నారు. ప్రతి డివిజన్కు కోటి రూపాయలు టీయూఎఫ్ఐడీసీ నిధులతో డ్రైనేజీలు, రోడ్లు, కల్వర్టులు నిర్మిస్తున్నట్లు చెప్పారు. నగర అభివృద్ధి కోసం మంత్రి కేటీఆర్ ప్రతి డివిజన్కు రూ.కోటి మంజూరు చేశారని తెలిపారు. కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూకిరణ్, బీఆర్ఎస్ నాయకుడు సుజిత్సింగ్ ఠాకూర్, సత్యప్రకాశ్, సూదం రవిచందర్, సిర్ప రాజు, బూరుగుపల్లి కల్పన, మల్లేశ్గుప్తా, కిశోర్పాండే, మహేశ్, అనిల్, బైఖాన్ మధు, రాజేశ్, రాజేంద్రప్రసాద్, విజయ్, చంద్రభూషణ రాజు, సయ్యాజీలాల్, ఆకుల హేమలత, శ్రీనివాస్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు
నగరంలోని లిమ్రా గార్డెన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 402 మందికి మంజూరైన షాదీ ముబారక్ చెక్కులను అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నదని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రెడ్కో మాజీ చైర్మన్ ఎస్ఏ అలీం, డిప్యూటీ మేయర్ ఇద్రిస్ఖాన్, కార్పొరేటర్లు బబ్లూఖాన్, అబ్దుల్ ఖుద్దూస్, మైనార్టీ విభాగం అధ్యక్షుడు ఇమ్రాన్ షహజాద్, షకీల్ పాల్గొన్నారు.