డిచ్పల్లి, డిసెంబర్ 22 : మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు కాగా. లబ్ధిదారులకు ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ గురువారం పంపిణీ చేశారు. ధర్మారం గ్రామానికి చెందిన ప్రశాంత్కు రూ.23 వేలు, కొరట్పల్లికి చెందిన కృష్ణవేణికి రూ.55 వేలు, మిట్టపల్లికి చెందిన సుమలతకు రూ.2 లక్షలు,దూస్గామ్కు చెందిన శ్రీనివాస్కు రూ.60 వేలు, ఘన్పూర్ గ్రామానికి చెందిన సిసింద్రికి రూ.లక్ష, నడిపల్లికి చెందిన అరుణకు రూ.లక్షా 28 వేలు, అమృతాపూర్ గ్రామానికి చెందిన కె జీవన్కు రూ.50వేలు మంజూరైనట్లు వివరించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, డిచ్పల్లి జడ్పీటీసీ సభ్యురాలు దాసరి ఇందిరా లక్ష్మీనర్సయ్య, మండల అధ్యక్షుడు చింత శ్రీనివాస్రెడ్డి, యూత్ విభాగం అధ్యక్షుడు అమీర్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు దండుల సాయిలు, సర్పంచుల ఫోరం ప్రధాన కార్యదర్శి జగదీశ్ పాల్గొన్నారు.
ట్రాక్సూట్, షూస్ పంపిణీ
డిచ్పల్లి ఏడో బెటాలియన్ పోలీస్ క్యాంపు పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రిలిమ్స్, ఈవెంట్స్ పూర్తిచేసుకున్న ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు జిల్లా పరిషత్ ఆర్థిక ప్రణాళికా సంఘం సభ్యుడు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు, జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ ట్రాక్ సూట్, షూస్ను పంపిణీ చేశారు. రూ.4.50లక్షల విలువ జేసే ట్రాక్సూట్, షూస్ను పంజాబ్లోని జలంధర్ నుంచి తెప్పించినట్లు బెటాలియన్ సిబ్బంది తెలిపారు.
టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సహకారంతో చేపడుతున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకొని తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలని సూచించారు. మొత్తం 115 మంది అభ్యర్థులు బాజిరెడ్డి ఉచిత కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందగా ప్రిలిమ్స్, ఈవెంట్స్లో 97 మంది ఉత్తీర్ణత సాధించడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో క్యాంపు నిర్వాహక ప్రాజెక్టు డైరెక్టర్ దినేశ్, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.