కామారెడ్డి, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ) : నిరుపేద మైనారిటీ జీవితాల్లో వెలుగులు నింపే విధం గా ప్రభుత్వం చేయూతనిస్తున్నదని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. శనివారం కామారెడ్డి కలెక్టరేట్లో స్వయం ఉపాధి కింద మైనారిటీ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విప్ మా ట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సా యం తో ఆర్థికంగా బలోపేతమై ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలని కోరారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని తెలిపారు. త్వరలో మైనారిటీ మహిళలకు 300 కుట్టు మిషన్లు ఉచితంగా అందజేస్తామని చెప్పారు. 75 మంది మైనారిటీలకు రూ.లక్ష చొప్పు న చెక్కులను పంపిణీ చేశారు. కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ మాట్లాడుతూ ఆర్థిక సహాయాన్ని మైనారిటీలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.మైనారిటీల సంక్షేమానికి ప్రభు త్వం కృషి చేస్తున్నదని ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దీన్ పేర్కొన్నారు. త్వరలో రెండో విడుత చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు.
పంచాయతీ కార్యదర్శులపై పెరిగిన బాధ్యత
పంచాయతీ కార్యదర్శులకు మరింత బాధ్యత పెరిగిందని విప్ అన్నారు. రెగ్యులర్ అయిన పంచాయ తీ కార్యదర్శులకు గంపగోవర్ధన్ శుభాకాంక్షలు తెలిపారు. కామారెడ్డి నియోజకవర్గంలోని 70 మంది పంచాయతీ కార్యదర్శులను శాశ్వత ప్రాతిపదికన నియమిస్తూ నియామక పత్రాలను అందజేశారు.కార్యక్రమంలో స్థానిక సంస్థ అదనపు కలెక్టర్ మనుచౌదరి, జడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్కుమార్, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, జిల్లా ఇన్చార్జి మైనారిటీ సంక్షేమ అధికారి దయానంద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్రావు, కామారెడ్డి ఎంపీపీ ఆంజనేయులు, మాచారెడ్డి జడ్పీటీసీ రాం రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.