కామారెడ్డి/ఖలీల్వాడి, మే 3 : ప్రజల కు దృష్టి సమస్యలను పూర్తిగా దూరం చేసేం దుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కంటి వెలు గు కార్యక్రమం ఉమ్మడి జిల్లాలో జోరుగా కొనసాగుతున్నది. వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలు, మందులను ఉచితంగా అందజేస్తున్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 44 బృందాలతో 4,852 మందికి పరీక్షలు నిర్వహించినట్లు డీఎం హెచ్వో లక్ష్మణ్ సింగ్ తెలిపారు. 523 మందికి కళ్లద్దాలు పంపిణీ చేశామన్నారు.
ఇప్పటి వరకు 3,67,440 మందికి పరీక్ష లు నిర్వహించి 53,756 మందికి కళ్లద్దాలు పంపిణీ చేశామని చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం విజ యవంతంగా కొనసాగుతున్నదని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి సుదర్శనం ఒక ప్రకటణలో తెలిపారు. 7,985 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 659 అద్దాల ను అందజేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు 5,31,168 కంటి పరీక్షలు చేయగా, 85,077 మందికి అద్దాలు అందజేశామని తెలిపారు.