వినాయకనగర్/కామారెడ్డి, జనవరి 18: భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులను మారుస్తూ గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఉత్తర్వులు వెలువరించింది. నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగిన బస్వా లక్ష్మీనర్సయ్యను తొలగించి, ఆయన స్థానంలో దినేశ్ కులాచారిని నియమించారు.
దినేశ్ కులాచారి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. బీజేపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలిగా అరుణతార కొనసాగనున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు అధ్యక్షులను మార్చినప్పటికీ కామారెడ్డిలో ఎలాంటి మార్పూ చేపట్టలేదు. జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణతార రెండోసారి జిల్లా అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.