బీబీపేట్/ నిజాంసాగర్, మే 20: ధాన్యం కొనుగోళ్లు సరిగా నిర్వహించడం లేదంటూ బీబీపేట మండల కేంద్రంలోని ప్రధాన చౌర స్తా వద్ద మల్కాపూర్ గ్రామ రైతులు సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లలో సొసైటీ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. దీంతో అకాల వర్షంతో వడ్లు తడిసి మొలకలు వస్తున్నాయని పేర్కొన్నారు. ధర్నా చేస్తున్న విషయం తెలుసుకున్న డీసీఎంఎస్ ఇన్చార్జి చైర్మన్ ఇంద్రసేనారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడారు. లారీల కొరతతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వారంలోపు ధాన్యా న్ని తరలిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు శాంతించారు.
నిజాంసాగర్ మండల కేంద్రంలోని చౌరస్తా వద్ద రైతులు సోమవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకం, బస్తాలను రైస్మిల్లులకు తరలించడంలో సొసైటీ సిబ్బంది నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాస్తారోకోలో నిజాంసాగర్, మాగి, గోర్గల్, సుల్తాన్నగర్ తదితర గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. కొనుగోళ్లు త్వరగా పూర్తిచేస్తామని, ధాన్యం బస్తాలను మిల్లులకు తరలించేందుకు చర్యలు తీసుకుంటామని అచ్చంపేట సొసైటీ కార్యదర్శి హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు.