నిజామాబాద్ రూరల్/ ఇందల్వాయి/ సిరికొండ/ ధర్పల్లి, నవంబర్ 27 : కాంగ్రెస్ నాయకులు మ్యానిఫెస్టోలో చేర్చి ప్రచారం చేస్తున్న ఆరు గ్యారంటీ హామీలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని బీఆర్ఎస్ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. నగర శివారులోని ఖానాపూర్, ఇందల్వాయి మండలంలోని గన్నారం, ధర్పల్లి, సిరికొండ మండలకేంద్రంతోపాటు గడ్కోల్, తాళ్లరామడుడు, హుస్సేన్నగర్, కొండూర్లో మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్తో కలిసి సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ శ్రేణులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బాజిరెడ్డికి మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి మాట్లాడుతూ.. పక్క రాష్ట్రమైన కర్ణాటకలో అమలుకు సాధ్యం కాని హామీలను ఇచ్చి అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఆరు నెలలు గడుస్తున్నా ఇంతవరకు వాటిని నెరవేర్చక వైఫల్యం చెందిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా గ్యారంటీ హామీలతో అధికారం చేజిక్కించుకునేందుకు ఇక్కడి కాంగ్రెస్ నాయకులు ఆరాటపడుతున్నారన్నారు. ఒకవేళ కాంగ్రెస్కు ఓటు వేస్తే సీఎం కుర్చీ కోసం ఆ పార్టీ నాయకులు కొట్లాడుకోవడానికే సమయం సరిపోతుందని, ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేస్తారని అన్నారు.
50 ఏండ్ల పాటు రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమ కోసం చేసింది శూన్యమన్నారు. తెలంగాణలో కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టంచేశారు. హనుమాన్ ఆలయం లేని గ్రామం లేదని, తెలంగాణలో కేసీఆర్ పథకం అందని ఇల్లు లేదని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలుచేస్తున్నదన్నారు. సాగునీరు పుష్కలంగా ఉండడంతో రైతులకు గన్నారంలో 120 ఎకరాలకు 60 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చిందని, రైతులకు ఇంతకన్నా ఏం కావాలని అన్నారు. ధర్పల్లిని మున్సిపల్ కార్పొరేషన్గా, రెవెన్యూ డివిజన్గా మారుస్తానని హామీఇచ్చారు. తనను మరోసారి ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పలువురు యువకులు బీఆర్ఎస్లో చేరగా… వారికి బాజిరెడ్డి గులాబీ కండువాలు వేసి ఆహ్వానించారు. గన్నారంలో బాజిరెడ్డిని నాయకులు గజమాలతో సత్కరించారు. కార్తీకపౌర్ణమి సందర్భంగా గన్నారంలోనిర్వహించిన సత్యనారాయణ వ్రతంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. శివాలయంలో పూజలు చేశారు.
ఖానాపూర్లో బీఆర్ఎస్ నాయకులు సాలూగారి మోహన్, జగన్ యాదవ్, నాగేశ్వర్రావు, సాగర్, ముస్కె సంతోష్, బొల్లెంక గోపాల్రెడ్డి, సర్పంచులు అశోక్, శ్రీనివాస్రెడ్డి, సురేందర్రెడ్డి, నవీన్ పాల్గొన్నారు.
గన్నారంలో డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, ఎంపీపీ రమేశ్నాయక్, జడ్పీటీసీ సుమనారవిరెడ్డి, వైస్ ఎంపీపీ భూసాని అంజయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చిలువేరి గంగాదాస్, సొసైటీ చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు లోలం సత్యనారాయణ, ఎస్సీ సెల్ కన్వీనర్ పాశంకుమార్, గ్రామశాఖ అధ్యక్షుడు గంగాధర్ పాల్గొన్నారు.
ధర్పల్లిలో జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, ఎంపీపీ నల్ల సారిక, రైతుబంధు సమితి మండల కన్వీనర్ పీసు రాజ్పాల్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్, మాజీ అధ్యక్షుడు నల్ల హన్మంత్రెడ్డి, సొసైటీ చైర్మన్ చెలిమెల చిన్నారెడ్డి, సర్పంచ్ పెద్దబాల్రాజ్ పాల్గొన్నారు. సిరికొండలో బీఆర్ఎస్ మండలఅధ్యక్షుడు శ్రీనివాస్, ఎంపీపీ సంగీతా రాజేందర్, జడ్పీటీసీ మాన్సింగ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షురాలు మంజుల, గాండ్ల సతీశ్, ఆకుల తిరుమల్, సర్పంచులు దేవాగౌడ్, లక్ష్మి, నర్సయ్య, ధనం లక్ష్మి, తిరుపతి, ఎన్నం రాజారెడ్డి, నర్సారెడ్డి పాల్గొన్నారు.