భిక్కనూరు, ఫిబ్రవరి 4: మండలంలోని కాచాపూర్ గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల సముదాయం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం ధ్వంసం చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వం కాచాపూర్ గ్రామంలో 50 డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించగా..
నిర్మాణ పనులకు అప్పటి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆదివారం గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయగా.. కారకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు