బాన్సువాడ టౌన్, అక్టోబర్ 6: పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియంలో బుధవారం నిర్వహించిన దసరా సంబురాలు, రావణ దహన కార్యక్రమానికి సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. చెడుపై మంచిని సాధించిన విజయానికి గుర్తుగా దసరా జరుపుకొంటామన్నారు.
కొన్నేండ్లుగా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి దసరా పండుగ రోజున రావణ దహన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నందుకు అభినందనలు తెలిపారు. విజయం అనేది ఎల్లప్పుడు సత్యం, ధర్మం వైపే నిలబడుతుందనడానికి సాక్ష్యం కురుక్షేత్ర యుద్ధమని పేర్కొన్నారు. మనం మంచి అలోచనలతో ముందుకెళ్తే విజయం తనంతటతానే ముందుకు వస్తోందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, రైతుబంధుసమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, బాన్సువాడ విండో చైర్మన్ కృష్ణారెడ్డి, ఏఎంసీ చైర్మన్ నెర్రె నర్సింహులు, ఎంపీపీ దొడ్ల నీరజా వెంకట్రాం రెడ్డి, జడ్పీటీసీ పద్మా గోపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ ఎజాస్, హనుమాన్ వ్యాయామశాల చైర్మన్ గురు వినయ్, టీఆర్ఎస్( బీఆర్ఎస్) పట్టణ అధ్యక్షుడు పాత బాలకృష్ణ, పట్టణవాసులు పాల్గొన్నారు.