ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్
నాగిరెడ్డిపెట్, జూన్ 27: దళిత బంధు పథకం దేశానికే ఆదర్శమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. మండలంలోని తాండూర్ గ్రామానికి చెందిన దళిత బంధు లబ్ధిదారుడికి మంజూరైన బట్టల దుకాణాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నదన్నారు. అన్ని వర్గాల ప్రజలను తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటున్నదన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అందిస్తున్నారన్నారు.
ఈ మండలానికి 10 దళిత బంధు యూనిట్లు మంజూరైనట్లు తెలిపారు. లబ్ధిదారులకు యూనిట్లు అందజేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ రాజదాస్, జడ్పీటీసీ సభ్యుడు మనోహర్రెడ్డి, ఎల్లారెడ్డి ఏఎంసీ మాజీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, ఎంపీడీవో రఘు, సింగిల్విండో చైర్మన్ నర్సింహులు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు మోతె శ్రీనివాస్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కృష్ణ, సర్పంచులు వంజరి సునిత, కిచ్చయ్యగారి సునిత, అనుషా, విజితారెడ్డి, ప్రవీణ్, సుభాకర్రెడ్డి, కృష్ణారెడ్డి, ఎంపీటీసీలు గుర్రాల సుశీల, మాధవి, వినితారెడ్డి, విమలవ్వ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుర్రాల సిద్దయ్య, జనరల్ సెక్రటరీ మంగళి యాదగిరి, నాయకులు పర్వత్రావు, బండబాబు, కిరణ్, శ్రీనివాస్రెడ్డి, విఠల్రెడ్డి, సంతోష్గౌడ్, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాసన్పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన హనుమాన్ ఆలయంలో ఎమ్మెల్యే జాజాల పూజలు చేశారు.